NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు
    తదుపరి వార్తా కథనం
    AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు
    ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు

    AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

    ఈ మేరకు బడ్జెట్ అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. "తల్లికి వందనం" పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. అలాగే నిరుద్యోగ భృతి పథకానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప ప్రగతిగా ఆయన పేర్కొన్నారు.

    గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, రూ. 1.35 లక్షల కోట్ల బకాయిలు పెంచిందని మంత్రి పార్థసారధి విమర్శించారు.

    రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

    వివరాలు 

    కూటమి పార్టీ ఎన్నికల హామీలు - "సూపర్ సిక్స్" పథకాలు 

    "సూపర్ సిక్స్" పథకాల అమలులో ఇప్పటికే రెండు ముఖ్యమైన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.

    మొదట, పింఛన్లను రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు పెంచడం జరిగింది.

    అలాగే, ఉచిత గ్యాస్ పంపిణీ పథకానికి రూ. 840 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. మిగతా రెండు పథకాల అమలుకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు.

    వివరాలు 

    అన్నదాత సుఖీభవ పథకం: రైతుల కోసం గుడ్ న్యూస్ 

    బడ్జెట్‌లో రైతులకు మంత్రి పార్థసారధి గుడ్ న్యూస్ చెప్పారు."అన్నదాత సుఖీభవ" పథకానికి రూ. 4,500 కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 20,000 జమ చేయనుంది. వచ్చే సంక్రాంతి నుండి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    "పీఎం కిసాన్ సమ్మాన్ యోజన" ద్వారా కేంద్రం రూ. 6,000 అందిస్తుండగా, ఏపీ ప్రభుత్వం అదనంగా రూ. 14,000 అందించి, రైతులకు మొత్తం రూ. 20,000 అందించనుంది.

    వివరాలు 

    కూటమి ప్రభుత్వం తీసుకునే భవిష్యత్ చర్యలు 

    "సూపర్ సిక్స్" పథకాలు కొనసాగిస్తూ, రైతులకు వచ్చే ఏడాది నుండి "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్" పథకంలో ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు.

    "పొలం పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా, రైతుల సంక్షేమం కోసం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పార్థసారధి తెలిపారు.

    2024లో కొత్త సాగుదారుల చట్టం:

    2024లో "కౌలు రైతు గుర్తింపు కార్డులు" జారీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం.

    అర్హతగల కౌలు రైతులు ఈ కార్డులను పొందుతారు. "రైతులు తమ సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్ 155251 ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఇప్పటివరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా రైతుల సందేహాలను పరిష్కరించాం" అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025