NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ
    తదుపరి వార్తా కథనం
    Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ
    జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం

    Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 03, 2023
    01:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

    మొత్తం 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించిన కేబినెట్, రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

    ఇదే సమయంలో ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు రూ.19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది.

    అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు, 6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.

    DETAILS

    నేషనల్ లా వర్సిటీ కోసం 100 ఎకరాల స్థలం కేటాయింపు

    మరోవైపు ఏపీలో పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానాన్ని ఆమోదించింది. కర్నూలులో జాతీయ లా యూనివర్సిటీకి మరో 100 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

    ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో ప్రారంభమైన భేటీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది.

    సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తూ నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

    ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు (పాత్రికేయులకు) ఇచ్చిన హామీని వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా  పాకిస్థాన్
    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత
    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు  రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు  భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం  సచివాలయం
    అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్ నారా లోకేశ్
    చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్  తెలంగాణ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?  కడప
    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025