Page Loader
Ap Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Ap Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 14 అంశాలను ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యంగా మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత్‌ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,700 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండు ఇంజినీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను కూడా కేబినెట్ ఆమోదించింది.సీఆర్డీఏ పరిధిలో రూ.2,700 కోట్ల పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో సవరణలు చేయడం ద్వారా భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగించేందుకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

వివరాలు 

కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో పడకల సంఖ్యను 100కి పెంచడంపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై కూడా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. మరింతగా,నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపే అవకాశం ఉంది. సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది.