NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..
    ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..

    AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    02:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    దీపావళి నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి మంత్రివర్గం ఆమోదించింది.

    నగదుతో సిలిండర్ కొనుగోలు చేస్తే, 48 గంటల్లోనే ఆ మొత్తాన్ని తిరిగి అకౌంట్‌లో జమ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.

    ఒకేసారి మూడు సిలిండర్లు ఇవ్వకుండా, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ అందించాలనే నిర్ణయమైంది.

    ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల బరువు పడుతుందని చర్చలో వెల్లడైంది.

    వివరాలు 

    ఇసుక పంపిణీని పూర్తిగా ఉచితం 

    ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదించింది.

    సీనరేజ్ ఛార్జీల రద్దు వల్ల ప్రభుత్వానికి రూ.264 కోట్ల భారమవుతుందని అంచనా వేశారు. ఉచిత ఇసుకను సక్రియంగా అమలుకు తీసుకురావడానికి నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం..

    పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    ఉచిత ఇసుకను సరిగ్గా అమలు చేయడానికి మంత్రులు,జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

    ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను నియమించి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు.

    ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వడానికి, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించింది.

    వివరాలు 

    విశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపు రద్దు

    విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకి చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

    వైసీపీ ప్రభుత్వ కాలంలో అప్పటి సీఎం జగన్, తన గురువు మరియు అత్యంత సన్నిహితుడైన స్వరూపానందేంద్ర కోరినట్లు, భీమిలి పట్టణానికి సమీపంలో కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్రతీరానికి దగ్గరగా రూ. కోట్ల విలువైన భూమిని ఎకరానికి రూ. లక్ష చొప్పున అడ్డగోలుగా కేటాయించారు.

    గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది మరియు శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు ఇండియా
    CBN Tributes to Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం.. ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌ నారా లోకేశ్
    AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. భారీ వర్షాలు
    DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ..  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025