NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం..
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం..
    కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం..

    AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 10, 2024
    10:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది క్షణాల్లో ప్రారంభంకానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.

    ఇందులో ముఖ్యమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించబోతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల పునర్నిర్మాణానికి సంబంధించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది.

    ఇంకా, చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

    అలాగే, 13 కొత్త మున్సిపాలిటీలలో 190 కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనపై కూడా చర్చ జరుగనుంది.

    వివరాలు 

    పాలక మండళ్లలో సభ్యులకు ఇద్దరు బ్రాహ్మణులు

    మరోవైపు, రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణపై ప్రతిపాదన కేబినెట్‌ ముందు ఉంచబోతోంది.

    దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

    పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించడానికి సంబంధించిన అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందని అంచనా ఉంది.

    5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    వివరాలు 

    ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం

    రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై కూడా చర్చ జరగనుంది.

    మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది.

    అంతేకాకుండా, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై కూడా కేబినెట్ చర్చించబోతోంది.

    సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చ జరగనున్నది. పీ-4 విధానం అమలు చేయనున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

    వివరాలు 

    అర్చకులకు స్వయం ప్రతిపత్తి

    మరోవైపు, దేవాలయాల్లో పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

    ఆయా దేవాలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    దేవదాయ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.

    ఈ నిర్ణయం ద్వారా అర్చకులకు విస్తృత అధికారాలు కట్టబెట్టినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన పోలవరం

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు  భారతదేశం
    Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన  శివరాజ్ సింగ్ చౌహాన్
    Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు  భారతదేశం
    Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు  విజయవాడ సెంట్రల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025