Andhrapradesh: నేడు ఏపీ మంత్రివర్గ భేటీ .. వాలంటీర్లు,అమ్మకు వందనం,ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది. నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. కొత్త పాలసీలను, ఉద్యోగాల కల్పనకు సంబంధించి నూతన విధానాలను ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ముఖ్యంగా, వాలంటీర్ల అంశం, అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేసే విషయంపై చర్చించనున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం
ఈ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానాలను ఖరారు చేయనున్నారు. దీపావళి పండుగ నాడు ఈ పథకం అమలు ప్రారంభించాలనుకుంటున్నారు. వాలంటీర్ల పై చర్చ వాలంటీర్ల వ్యవహారం పై కూడా ఈ రోజు చర్చ జరుగనుంది. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ, వేతనాల చెల్లింపు, వారి సేవలు కొనసాగించాల్సిన సంఖ్య వంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
నూతన పాలసీలు, పన్ను రద్దు
రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం కొత్త పాలసీలను మంత్రివర్గం ఆమోదించనుంది. చెత్త పన్ను రద్దు పై ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఉంది. ఈ అంశంపై అధికారిక నిర్ణయం తీసుకోనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ పై కూడా చర్చించనున్నారు. బాధితులకు భారం లేకుండా రుణాల రీషెడ్యూల్ చేసేందుకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుని అందించాలనే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మున్సిపాలిటీలలో కొత్త పోస్టుల భర్తీ రాష్ట్రంలో 13 కొత్త మున్సిపాలిటీలలో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది.
మంత్రివర్గం ఆమోదం
ప్రభుత్వ పథకాల అమలు ఆలయ పాలకవర్గాలలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వానికి బాధ్యతల స్వీకరణ తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, అందుకే బడ్జెట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి నుండి పీ-4 విధానాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గంలో చర్చ జరుగుతుంది. అమ్మకు వందనం పథకం ఇంకో ఎన్నికల హామీగా అమలు చేయాల్సిన అమ్మకు వందనం పథకంపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పథకాన్ని వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని భావించినా, ముందే అమలు చేయాలనే విషయంపై నేటి సమావేశంలో చర్చ జరుగనుంది.