NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ECI: 5,600 మంది CRPF బలగాల పహారాలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు: సీఈవో ఎంకే మీనా
    తదుపరి వార్తా కథనం
    ECI: 5,600 మంది CRPF బలగాల పహారాలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు: సీఈవో ఎంకే మీనా

    ECI: 5,600 మంది CRPF బలగాల పహారాలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు: సీఈవో ఎంకే మీనా

    వ్రాసిన వారు Stalin
    Jun 03, 2024
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్'లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.

    ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని..ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను.. తర్వాత ఈవీఎం బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారని తెలిపారు.

    ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా రావడంతో వీటికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని.. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని తెలిపారు.

    26,473 మంది హౌమ్‌ ఓటింగ్‌ ద్వారా ఓటు వేసినట్లు తెలిపారు. 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేసినట్లు తెలిపారు.

    Details 

    పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ముందు, ఈవీఎం టేబుళ్లు సిద్ధం: ఎంకే మీనా 

    పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు.. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించిందన్నారు.

    ప్రతి కౌంటింగ్‌ హాలులో కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారని.. ప్రతి సెంటర్‌లో మీడియా రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

    లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉందని.. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరించామని తెలిపారు.

    కౌంటింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లు అనుమతించేది లేదని.. మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకెళ్లవచ్చని తెలిపారు.

    Details 

    సోషల్ మీడియా పై డేగ కన్ను: డిజిపి 

    సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

    మరో వైపు 5,600 మంది CRPF బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించారు.

    వీటిని పర్యవేక్షణకు IG చారు సిన్హా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. మరో వైపు ఓట్ల లెక్కింపు రోజున మద్యం షాపులను మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆంధ్రప్రదేశ్

    బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ  చంద్రబాబు నాయుడు
    AP Politics: ఏపీలో ఎట్టకేలకు ఖరారైన పొత్తు.. టీడీపీ 17, బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ  భారతదేశం
    AP High Court: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు హైకోర్టు
    Mudragada Padmanabham: ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరిక వాయిదా.. తాడేపల్లికి ర్యాలీ రద్దు..!  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025