NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు 
    తదుపరి వార్తా కథనం
    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు 
    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు; చైతన్య రథం మ్యాగజైన్ పబ్లిషర్‌కు నోటీసులు

    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు 

    వ్రాసిన వారు Stalin
    Apr 11, 2023
    06:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగుదేశం పార్టీ/టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ మ్యాగజైన్ చైతన్య రథం పబ్లిషర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

    మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఐడీ అధికారులు సందర్శించి పత్రిక ప్రచురణకర్త వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఐడీ బృందం పార్టీ కార్యాలయంలో పలువురు సీనియర్ నేతలతో సంభాషించి పత్రిక ప్రచురణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.

    పత్రిక ప్రింటర్ వివరాలను, దాని సర్క్యులేషన్ వివరాలను సమర్పించాలని వారు నేతలను కోరారు. పార్టీ కార్యాలయంలో మ్యాగజైన్ ఎడిటోరియల్ టీమ్‌కు ఏదైనా కంట్రోల్ రూమ్ ఉందా అని కూడా వారు అడిగారు. పబ్లికేషన్ టీమ్ సేకరించిన విషయాలపై సీఐడీ అధికారులు ఆరా తీశారు.

    టీడీపీ

    ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఫిర్యాదు మేరకు నోటీసులు

    డిజిటల్ మ్యాగజైన్ బాధ్యతలను టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇన్‌ఛార్జ్ గురజాల మాల్యాద్రి నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    మాల్యాద్రి డిజిటల్ పత్రిక ప్రచురణ కోసం పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల నుంచి డేటాను సేకరిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఫిర్యాదు మేరకు టీడీపీ పత్రిక ప్రచురణకర్తపై సీఐడీ కేసు నమోదు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    టీడీపీ తన పత్రిక చైతన్య రథంలో ప్రచురితమైన కథనం ద్వారా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోందని ఆర్థిక మంత్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు హైకోర్టు
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం తెలంగాణ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ

    తాజా వార్తలు

    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము
    20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా నాసా
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025