NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన
    తదుపరి వార్తా కథనం
    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన
    అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన

    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 09, 2023
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం ముందుకెళ్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు.

    ప్రస్తుతం పరిపాలన రాజధానిపై ఉన్న వివాదాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తొలుత అధికార నివాసంతో పాటు క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ మేరకు అక్టోబర్ లోగా వైజాగ్ నగరానికి తన ఆవాసం మార్చేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమచారం అందుతోంది.

    ఇదే క్రమంలో పాలనా యంత్రాంగాన్ని(ప్రభుత్వ ఉద్యోగులను) విశాఖకు తరలించడంపై త్వరలోనే స్పష్టత రానుంది.

    రుషికొండలో ఇప్పటికే సీఎం కార్యాలయానికి సంబంధించి భవనాలు ఏర్పాటయ్యాయని అధికార వర్గాలు అంటున్నాయి.

    DETAILS

    నలుదిక్కులా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న ప్రభుత్వం

    మరోవైపు అమరావతినే రాజధానిని కొనసాగించాలని అక్కడి రైతులు పలు కేసులు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా సీఎం అనుకున్న మూడు రాజధానులు ప్రతిపాదన ముందుకు సాగలేదు.

    ఇప్పటికీ ఆయా అంశాలపై కోర్టుల్లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడ్నుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం ముఖ్యమంత్రికి ఉంది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలోగా విశాఖకు తరలివెళ్లేందుకు సీఎం జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

    ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్లాలంటే అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని, వికేంద్రీకరణ జరగాలని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో నలుదిక్కులా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ప్రభుత్వం అనుకున్నట్లుగా పనులు పూర్తైతే అక్టోబర్‌లో విశాఖకు మారడం ఖాయంగా కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్
    Nirav Modi: యూకే హైకోర్టులో నీర‌వ్ మోదీకి షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌ యునైటెడ్ కింగ్డమ్
    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల

    ఆంధ్రప్రదేశ్

    ఏపీలో గిరిజన వ్యక్తిపై అమానుషం.. మద్యం మత్తులో నోట్లో మూత్రం ఒంగోలు
    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్! జనసేన

    ప్రభుత్వం

    ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్ గుజరాత్
    నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన తెలంగాణ
    ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ   ఆంధ్రప్రదేశ్
    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం భగవంత్ మాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025