NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు
    తదుపరి వార్తా కథనం
    ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు
    గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు

    ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 16, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో బాధితురాలు నరకయాతన అనుభవించింది. బాధిత మహిళ కడుపులోనే ఆపరేషన్ చేసిన కత్తెరను మర్చిపోయి కుట్లు వేశారు.

    వారం కిందట కాన్పు నిమిత్తం ఓ గర్భిణీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం ఆమెకు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు.

    అయితే సదరు మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కడుపు నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు మరోసారి ఆగస్ట్ 8న ఏలూరి ఆస్పత్రికి వచ్చింది. ఎక్స్ రే తీసి ఆమెను పరీక్షించగా విస్తుబోయే విషయం వెల్లడైంది. కడుపులోనే కత్తెర ఉందని గుర్తించారు.

    details

    ఎక్స్ రే ఫొటోలు బహిర్గతమవడంతో స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ 

    కత్తెరను గుర్తించిన వెంటనే విజయవాడ ఆస్పత్రికి పంపించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్ వెల్లడించారు.

    మరోవైపు ఆస్పత్రి రికార్డ్ నుంచి బాధితురాలి వివరాలు మాయం కావడం గమనార్హం. ఈ మేరకు వ్యవహారం బయటకు పొక్కకుండా అక్కడి డాక్టర్లు, వైద్యాధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

    సదరు ఎక్స్ రే ఫొటోలను ఓ ఉద్యోగి తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో మొత్తం బండారం బయట పడింది.

    వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 19న ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఎస్ కొత్తపల్లికి చెందిన వి.స్వప్న కాన్పు నిమిత్తం ఏలూరు ఆస్పత్రిలో చేరారు.

    ఈ మేరకు సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారని బాధితురాలు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏలూరు

    తాజా

    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్
    IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..? ఐపీఎల్
    PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక నరేంద్ర మోదీ

    ఏలూరు

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు తాజా వార్తలు
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి  అమెరికా
    ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025