
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సంస్థకు జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేసిన సర్కార్..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే అనుమతిచ్చిన పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో అవుకులో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని, ఈ మేరకు స్పష్టమైన అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
వివరాలు
ప్రాజెక్ట్ అభివృద్ధిలో ఏర్పడిన తీవ్రమైన ఆలస్యం
ఈ ప్రాజెక్ట్ అభివృద్ధిలో ఏర్పడిన తీవ్రమైన ఆలస్యం, అలాగే పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాజెక్ట్కు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేసే విషయంలో సంస్థ మించిన ఆలస్యం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు విషయంలో తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు న్యూఅండ్ రెన్యూబబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.