NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే!
    తదుపరి వార్తా కథనం
    Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే!
    ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే!

    Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త ప్రకటించింది.

    వచ్చే విద్యా సంవత్సరంలో అందించబోయే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ విషయంలో ముఖ్యమైన మార్పులను తీసుకుంది.

    ఈ కిట్‌లో యూనిఫామ్,బెల్టులు,బ్యాగ్‌ల రంగులు ప్రభుత్వం కొత్తగా మార్చింది. ఇక నుంచి ఈ వస్తువులపై రాజకీయ పార్టీల రంగులు లేదా నేతల బొమ్మలు ఉండకుండా ప్రత్యేకంగా రూపొందించారు.

    బెల్టుల అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉంచుతారు.గతంలో విద్యాకానుక అని రాసిన బెల్టులపై ఈసారి ప్రత్యేక లోగో మాత్రమే ఉంటుంది,ఆ లోగోలో గ్రాడ్యుయేట్ బొమ్మ ఉంటుంది.

    బ్యాగ్‌లకు లేత ఆకుపచ్చ రంగు ఖరారు చేయగా, యూనిఫామ్‌ విషయంలో లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడల చొక్కా,లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ ఉండేలా తీర్చిదిద్దారు.

    వివరాలు 

    ఒక్కో కిట్‌ ఖర్చు రూ. 1858.50

    జూన్ 12న పాఠశాలలు తెరుచుకునే రోజుకే ఈ కిట్ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది.

    టెండర్లు పిలవడానికి త్వరలో చర్యలు తీసుకోనున్నారు.కుట్టుకూలి డబ్బుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు రూ.120,9 నుంచి 10 తరగతుల వారికి రూ.240 చెల్లించనుంది.

    ఈ విద్యార్థి మిత్ర కిట్‌లో పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలు,వర్క్ బుక్స్,డిక్షనరీ, బెల్ట్, షూస్, బ్యాగ్, మూడు జతల యూనిఫామ్లు ఉంటాయి.

    ఒక్కో కిట్‌ ఖర్చు రూ. 1858.50 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    గత ప్రభుత్వ హయాంలో అందించిన కిట్‌లలో నాణ్యతపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కచ్చితమైన నాణ్యతతో వస్తువులను అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    ఆంధ్రప్రదేశ్

    US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే! తెలంగాణ
    Polavaram: పోలవరం నిర్మాణంలో నిపుణుల హెచ్చరికలు.. సమగ్ర ప్రణాళికలు అవసరం పోలవరం
    TIDCO Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి నారాయణ శుభవార్త..! భారతదేశం
    AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025