NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం 
    పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

    Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 24, 2025
    08:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా ఉండేందుకు ఇంధన శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.

    రాష్ట్రంలో ఫిబ్రవరి మూడో వారానికే విద్యుత్‌ డిమాండ్‌ 242.35 మిలియన్‌ యూనిట్లకు(ఎంయూ) చేరుకుంది.

    వేసవి ఆరంభంలోనే డిమాండ్‌ నియంత్రణ కోసం రోజుకు 10 ఎంయూల విద్యుత్‌ను మార్కెట్‌ ద్వారా డిస్కంలు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

    గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే వినియోగం సుమారు 9 ఎంయూల మేర పెరిగింది.

    గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ ఫిబ్రవరిలో 12,652 మెగావాట్లుగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు, ఈ నెల 17న అది 12,726 మెగావాట్లకు చేరినట్లు గుర్తించారు.

    వచ్చే మూడు నెలల్లో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 259 ఎంయూలకు పెరిగే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.

    వివరాలు 

    స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 400 మెగావాట్ల విద్యుత్‌

    ఫిబ్రవరిలో పోల్చితే వినియోగం సుమారు 4 శాతం అధికంగా ఉంటోంది.

    ప్రస్తుతం ఉన్న ఒప్పందాల ప్రకారం 230 ఎంయూల వరకు ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయవచ్చు.

    అదనంగా అవసరమైన 30 ఎంయూలను వివిధ మార్గాల్లో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 400 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

    వివరాలు 

    హరియాణా,పంజాబ్‌ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌

    హిందుజా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండో యూనిట్‌ను ఉత్పత్తిలోకి తెచ్చేందుకు కోల్‌ ఇండియా నుంచి బొగ్గు సరఫరా కోసం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ చర్యతో మరో 500 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    స్వాపింగ్‌ విధానం ద్వారా హరియాణా,పంజాబ్‌ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.

    డిస్కంలు సెంబ్‌కార్ప్‌తో 625 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి,ఇది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    AP Inter Hall Ticket: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్‌ మనమిత్రద్వారా ఇంటర్‌ హాల్‌టికెట్లు  భారతదేశం
    AP: ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ శుభవార్త .. రూ.8 కోట్లు విడుదల  భారతదేశం
    AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! భారతదేశం
    CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025