NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా
    తదుపరి వార్తా కథనం
    బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా
    3 వారాలకు విచారణ వాయిదా

    బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 05, 2023
    06:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్తిజం ఘాట్‌ నిర్మాణ పనులపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వివాదం ఉన్నత న్యాయస్థానానికి చేరుకుంది.

    బాప్టిజం ఘాట్‌‌ నిర్మాణ ప్రాంతం రెవెన్యూ డొంకా భూమిగా ఉందని న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టులో పిటిషన్ ‌దాఖలు చేశారు.

    నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సదరు పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన హైకోర్టు, మంగళగిరిలో బాప్టిజం ఘాట్‌ నిర్మాణంపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

    మరోవైపు ఘాట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో వివాదం మరింత ఎక్కువైంది.

    DETAILS

    పుణ్య స్నానాల కోసమే బాప్టిజం ఘాట్ నిర్మాణం :  క్రైస్తవ ప్రతినిధులు 

    ఈ మేరకు సర్కారు భూమిలో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ నిలిపివేయాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.

    ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాప్టిజం ఘాట్‌ నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడ్డారు.

    మత మార్పిడిని ప్రోత్సహించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆళ్ల కుట్ర చేస్తున్నాడని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    బాప్టిజం ఘాట్‌ నిర్మాణానికి సర్కారు స్థలం ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు.ఘాట్‌ మత మార్పిడి కోసం కాదని క్రైస్తవ ప్రతినిధులు వివరించారు. క్రైస్తవ సంప్రదాయాల్లో భాగంగా పుణ్యస్నానాల కోసమే నిర్మిస్తున్నామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం  పన్ను
    వారాహి యాత్రకి ముందు జనసేనాని ధర్మ పరిరక్షణ యాగం  జనసేన
    కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి
    వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025