AP Inter: రేపు విడుదల కానున్న ఏపీ ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు. మార్చి1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా,మొత్తం10,53,435 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 5,17,570మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కాగా,5,35,865 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష పేపర్లలో ఎలాంటి లీకేజీలు జరగకుండా ఇంటర్ బోర్డు విస్తృత చర్యలు చేపట్టింది. ప్రతి ప్రశ్నాపత్రం గరిష్ట భద్రతను నిర్ధారించడానికి క్రమ సంఖ్యలు, ప్రత్యేకమైన బార్ కోడ్తో గుర్తించబడింది. విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.22రోజుల్లోపు ఫలితాలను ప్రకటించడంలో ఇంటర్ బోర్డు శీఘ్ర పరిణామం అభినందనీయం.