NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్...దరఖాస్తుల స్వీకరణ గడువు ఎప్పటివరకంటే?
    తదుపరి వార్తా కథనం
    AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్...దరఖాస్తుల స్వీకరణ గడువు ఎప్పటివరకంటే?
    రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్

    AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్...దరఖాస్తుల స్వీకరణ గడువు ఎప్పటివరకంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    10:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలో ఉపాధ్యాయుల కోసం ప్రతిష్టాత్మక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 6న విడుదల కానుంది.

    16,000కు పైగా పోస్టులను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ సమీక్షలు పూర్తిచేసి నోటిఫికేషన్‌ను వెలువరించేందుకు సిద్ధమైంది.

    ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డీఎస్సీ నిర్వహణపై కొత్త నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి.

    గత జులైలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది, కానీ టెట్ నిర్వహణ కారణంగా వాయిదా వేయబడింది.

    ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడానికి, ఒకే ఏడాదిలో రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించబడింది. సోమవారం టెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

    వివరాలు 

    16,347 పోస్టుల భర్తీ 

    టెట్ ఫలితాలు వెలువడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

    జిల్లా వారీగా ఖాళీలను గుర్తించి, రెండు లేదా మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు డీఎస్సీ నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

    ఈ మెగా డీఎస్సీ 2024 ఉద్యోగ నియామక ప్రకటన నవంబర్ 6న విడుదల చేయనుంది, ఇందులో 16,347 పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యం.

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే డీఎస్సీ నియామకాలపై తొలిసంతకం చేశారు.

    వివరాలు 

    ఫిబ్రవరి 3 నుండి మార్చి 4 వరకూ పరీక్షలు

    మరోవైపు, వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది, కానీ మార్చి 16న ఎన్నికల కోడ్ అమలు కావడంతో పరీక్షలు జరగలేదు.

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ పై కసరత్తు ప్రారంభించింది.

    రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

    నవంబర్ 6 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందనే సమాచారం ఉంది. దరఖాస్తులను నెల రోజుల పాటు స్వీకరించేందుకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

    డిసెంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించబడనున్నాయి, ఫిబ్రవరి 3 నుండి మార్చి 4 వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    Cyclone Dana: 'దానా' తుఫాన్ ఎఫెక్టు.. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్‌కు ఐఎండీ అలర్ట్ తుపాను
    Orvakal: ఓర్వకల్లులో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు గల కారణాలు ఏమిటి . .అక్కడే ఎందుకు?  భారతదేశం
    AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర.. భారతదేశం
    APPSC: ఏపీపీఎస్సీకి కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం రాష్ట్రం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025