Page Loader
Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
Ap Palnadu Murders : ఏపీలో ఘోరం.. భర్త సహా అత్తమామల హత్య

Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 23, 2023
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగిలో దారుణం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ముగ్గురిని బంధువులే విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలోనే హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మృతులు కోనంకి చెందిన సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్‌గా పేర్కొన్నారు. సాంబశివరావు కోడలు మాధురి బంధువులే ఈ హత్యలు చేశారని పోలీసులు వెల్లడించారు. హత్యల తర్వాత నిందితులు తమకు లొంగిపోయారన్నారు.

DETAILS

మాధురిని వేధిస్తుండటంతో ఆమె తరుఫున బంధువులు దారుణానికి పాల్పడ్డారు : పోలీసులు 

గత కొన్నాళ్లుగా నరేష్, తల్లిదండ్రులతో కలిసి తన భార్య మాధురిని వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పలుమార్లు పంచాయితీలు నిర్వహించినా ఆశించిన మేర ఫలితం తీసుకురాలేకపోయింది. ఈ సందర్భంగా వేధింపులు ఎక్కువడంతో ముగ్గురిని హత్య చేసేందుకు ముందస్తు ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం నరేష్ భార్య మాధురి, బంధువులతో సహా ముప్పాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మాధురిని వేధిస్తుండటంతో ఆమె తరుఫున బంధువులు విచక్షణ కోల్పోయి అర్థరాత్రి తీవ్ర దాడి చేసి కత్తులతో నరికి చంపారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను పిడుగురాళ్లకు తరలించి గ్రామంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా భారీగా పోలీస్ బందోబస్తును సిద్ధం చేశారు.