NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్‌.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్
    తదుపరి వార్తా కథనం
    ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్‌.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్
    ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్‌.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్

    ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్‌.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 19, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలో ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడం, మరోవైపు జూన్ 20 గడుస్తున్నా అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యుత్‌ డిమాండ్‌ ఎవరూ ఊహించనంత భారీగా పెరిగింది.

    ఈ నేపథ్యంలో రాష్ట్ర డిస్కంల చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పినట్లైంది. ఈ మేరకు జూన్ 17న, శనివారం ఏకంగా 260.96 మిలియన్‌ యూనిట్లకు చేరుకోవడం విద్యుత్ వర్గాల్లోనే సంచలనంగా మారింది.

    జూన్‌ మూడో వారంలోనూ వర్షాలు లేక విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. మే 15 నుంచి క్రమంగా విద్యుత్ డిమాండ్‌ తగ్గుతుందని రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) అంచనా.

    అయితే విద్యుత్ అధికారులే ముక్కున వేలేసుకునేలా జూన్‌ మూడో వారం గడిచిపోతున్నా డిమాండ్‌ మాత్రం తగ్గకపోవడం కొసమెరుపు.

    DETAILS

    జూన్ మూడో వారంలోనూ వేసవిలో మాదిరే విద్యుత్‌ డిమాండ్‌

    ఆంధ్రప్రదేశ్ లో సరిపడ కరెంట్ ను సరఫరా చేసేందుకు, విద్యుత్‌ సంస్థలు ఓపెన్ మార్కెట్‌పై ఆధారపడాల్సి దుస్థితి నెలకొంటోంది.

    ఏటా జూన్‌ మొదటి వారమే వాతావరణం చల్లబడటం, దీంతో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా తయారైంది. మండు వేసవిని మించి విద్యుత్‌ వాడకం అధికంగా ఉండటం ఆశ్చర్యకరంగా మారింది.

    బహిరంగ మార్కెట్‌ ధరలు.. జూన్‌ నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో తలసరి విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో వేసవిలో మాదిరే విద్యుత్‌ డిమాండ్‌ నెలకొంది.

    DETAILS

    డిమాండ్ మేరకు విద్యుత్ సప్లై చేస్తున్నాం : ఏపీ డిస్కంలు

    విద్యుత్ వాడకం పీక్‌ డిమాండ్‌ లో ఉన్న సమయంలో యూనిట్‌ కరెంట్ కు రూ.10 (గరిష్ఠ ధర)ను చెల్లిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ( డిస్కంలు ) విద్యుత్ ను కొంటున్నాయి.

    డిమాండ్ అధికంగా ఉండటంతో అంతే మొత్తంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రతి రోజూ కనీసం 15 - 25 ఎంయూలను అదనంగా కొనుగోలు చేయాల్సి వస్తోందని డిస్కంలు చెబుతున్నాయి.

    2023 వేసవి నెలల్లో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ :

    నెల విద్యుత్ డిమాండ్ ( మిలియన్ యూనిట్లు )

    మార్చి 15 232.72 ఎంయూ

    ఏప్రిల్ 20 247.822 ఎంయూ

    మే 17 255. 230 ఎంయూ

    జూన్ 17 260. 96 ఎంయూ

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యుత్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య
    Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన! జస్పిత్ బుమ్రా
    Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్ టాలీవుడ్
    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు అమెరికా

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  గుంటూరు జిల్లా
    పోలవరం జలాశయంలో కుంగిన స్పిల్ వే గైడ్ బండ్... హుటాహుటిన సీడబ్ల్యూసీ సమీక్ష పోలవరం
    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం  కర్నూలు
    ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్ కేంద్రమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025