NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Tet: ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు.. అక్టోబర్‌ 3 నుంచి పరీక్షల నిర్వహణ 
    తదుపరి వార్తా కథనం
    AP Tet: ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు.. అక్టోబర్‌ 3 నుంచి పరీక్షల నిర్వహణ 
    ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు

    AP Tet: ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు.. అక్టోబర్‌ 3 నుంచి పరీక్షల నిర్వహణ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    10:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) జులై 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఈనెల 22న విడుదల కానున్నాయి.

    ఈ క్రమంలో, సెప్టెంబర్ 19వ తేదీ గురువారం నుంచి ఆన్‌లైన్ మాక్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ప్రకటించారు.

    మాక్ టెస్టులు విద్యార్థులకు సులభంగా రాయడానికి అవకాశమిస్తారని తెలిపారు.

    సెప్టెంబర్ 22 నుంచి టెట్ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్షలు అక్టోబర్ 3 నుంచి షెడ్యూల్‌ ప్రకారమే జరగనున్నాయని పేర్కొన్నారు.

    మోడల్‌ ప్రశ్న పత్రాలు https://cse.ap.gov.in/ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని విజయరామరాజు తెలిపారు.

    ఏపీ టెట్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    వివరాలు 

    అక్టోబర్ 4 నుంచి ప్రాథమిక కీలు విడుదల

    అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు AP TET 2024 పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి.

    రోజుకు రెండు సెషన్లు ఉంటాయి - ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు. ఈ పరీక్షల కోసం పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

    పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత, అక్టోబర్ 4 నుంచి ప్రాథమిక కీలు విడుదల అవుతాయి.

    అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.తుది ఆన్సర్ కీ అక్టోబర్ 27న విడుదల అవుతుంది. నవంబర్ 2న టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు.

    ఉత్తీర్ణత మార్కులు కమ్యూనిటీ వారీగా నిర్ణయిస్తారు-OC కేటగిరీలో 60%, BCలో 50%, SC/ST/PH/Ex-Servicemen కేటగిరీలకు 40% ఉత్తీర్ణత మార్కులు అవసరం.

    వివరాలు 

    4 లక్షలకుపైగా దరఖాస్తులు

    సమాచారం ప్రకారం, ఈసారి 4 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి.

    ఇందులో సోషల్ స్టడీస్‌కు 70,767 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పేపర్‌ 2-బీ విభాగంలో 2,438 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.

    రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి జరుగుతున్న మెగా డీఎస్సీకి ఈ టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుందని విధితమే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్! భారతదేశం
    Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..! విజయవాడ వెస్ట్
    Drone in vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా.. ట్రయల్‌ రన్‌ కు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం  భారతదేశం
    #Newsbytesexplainer: ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..? వరదలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025