NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు
    విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు

    Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 24, 2023
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంలో మరో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు మంత్రులు,అధికారులకు క్యాంపు కార్యాలయాల కోసం స్థలం గుర్తించారు.

    పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు.

    సీఎం ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు పనులు చకాచకా జరుగుతున్నాయి.

    ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించింది.

    ఈ మేరకు 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది .

    విశాఖ రిషికొండపై ఉన్న మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను హై లెవల్ కమిటీ గుర్తించింది.

    DETAILS

    ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ఆ టవర్స్ : సీఎస్

    మిలీనియం టవర్స్‌లోని A, B టవర్స్‌ను ఈ మేరకు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

    శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలన్నారు. వెసులుబాటు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

    ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లిన సమయంలో మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌లను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు.

    మొత్తం 2 లక్షల 27 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగించేందుకు ఏపీ సర్కార్ సంసిద్ధమైంది.

    ఇందులో భాగంగానే గురువారం ఏపీ సీఎస్ కీలక ఉత్తర్వులను వెలువరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం

    విశాఖపట్టణం

    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ

    ఆంధ్రప్రదేశ్

    స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్  సీఐడీ
    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత  హైకోర్టు
    Dussehra holidays: ఏపీలో దసరా సెలవుల్లో కీలక మార్పులు రాష్ట్రం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025