NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tg New Ration Cards : రేషన్ కార్డు అప్లికేషన్ల పేరిట దోపిడీ చేస్తే.. ఈ నంబర్​కు కాల్​ చేయండి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tg New Ration Cards : రేషన్ కార్డు అప్లికేషన్ల పేరిట దోపిడీ చేస్తే.. ఈ నంబర్​కు కాల్​ చేయండి
    రేషన్ కార్డు అప్లికేషన్ల పేరిట దోపిడీ చేస్తే.. ఈ నంబర్​కు కాల్​ చేయండి

    Tg New Ration Cards : రేషన్ కార్డు అప్లికేషన్ల పేరిట దోపిడీ చేస్తే.. ఈ నంబర్​కు కాల్​ చేయండి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నగరంలోని మీ సేవ కేంద్రాలు రేషన్ కార్డు దరఖాస్తుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాయి.

    ప్రభుత్వం నిర్ధేశించిన దరఖాస్తు ఫీజు రూ.50 మాత్రమే అయినప్పటికీ, కొన్ని కేంద్రాలు రూ.100 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నాయి.

    గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా మంజూరు చేయలేదు.

    కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

    వివరాలు 

    రాష్ట్రమంతటా దరఖాస్తుల స్వీకరణ

    ఇప్పుడు, దరఖాస్తు ప్రక్రియను మీ సేవ కేంద్రాల ద్వారా నిర్వహించాలని వెల్లడించడంతో, మూడు రోజులుగా ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

    ప్రతి కేంద్రం జనసందోహంతో కిక్కిరిసిపోతోంది. కొన్ని కేంద్రాల ముందు 200 మంది వరకు వేచి కనిపిస్తున్నారు.

    ఉదయం 8 గంటలకే జనం క్యూ కడుతుండగా, కేంద్రాలు 9 గంటలకు తెరుచుకోవడంతో గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది.

    రాష్ట్రమంతటా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుండటంతో, సర్వర్లు ఎప్పుడో ఒకప్పుడు డౌన్ అవుతూ పని నెమ్మదిగా సాగుతోంది.

    వివరాలు 

    ఫీజును క్యాష్ చేసుకుంటున్న నిర్వాహకులు 

    ప్రభుత్వ ఆధీనంలోని మీ సేవ కేంద్రాలు రూ.50 మాత్రమే తీసుకుంటున్నప్పటికీ, ప్రైవేట్ కేంద్రాల్లో నిర్బంధంగా అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా అధిక చార్జీలు విధిస్తున్నారు.

    దరఖాస్తుల్లో 60% కొత్తవి

    రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో 50-60% మంది గతంలో దరఖాస్తు చేసుకున్నవారే ఉన్నారని, మిగతా 40% మందిలో పేర్లు జోడించేవారు, తొలగించేవారు ఉన్నారని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు.

    గతంలో అప్లై చేసినవారు సురక్షితంగా ఉండటానికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు.

    వివరాలు 

    ఇతరులకు ఇబ్బందులు 

    రేషన్ కార్డుల దరఖాస్తులకు భారీగా జనాలు రావడం వల్ల, జన్మ ధృవపత్రాలు, కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

    కొన్ని ప్రాంతాల్లో రోజుకు 300 మందికి పైగా రాగా, సెంటర్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

    చివరి తేదీ లేదు!

    కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి చివరి తేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    అయినప్పటికీ, సమాచారం తెలియక ప్రజలు హడావుడిగా క్యూ కడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

    వివరాలు 

    దోచుకుంటే ఫిర్యాదు చేయండి! 

    రేషన్ కార్డు అప్లికేషన్‌కు మీ సేవ కేంద్రాలు రూ.50 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.

    అయితే, కొన్ని కేంద్రాలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

    దీనిపై 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు 10 ఫిర్యాదులు నమోదయ్యాయని, సంబంధిత నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని అధికారులు వెల్లడించారు.

    విచారణ అనంతరం లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. అలాగే, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలంగాణ

    Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్  భారతదేశం
    Osmania Hospital: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే.. భారతదేశం
    Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత! ఆంధ్రప్రదేశ్
    Coconut cultivation: ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025