NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు
    ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు

    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 07, 2025
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీఎస్‌ఆర్టీసీ మరో 600 విద్యుత్ బస్సులు పొందేందుకు ప్రణాళికలు చేస్తున్నది.

    ఈ బస్సులను వివిధ నగరాల పరిధిలో , వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో నడిపించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

    ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 14,000 విద్యుత్ బస్సులను వివిధ రాష్ట్రాల ఆర్టీసీలకు కేటాయిస్తోంది.

    ఈ క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాలకు 750 బస్సులను కేటాయించారు. ఆర్టీసీ ఈ సంఖ్యను మరింత పెంచాలని కేంద్రం నుంచి అదనంగా 600 బస్సుల్ని కోరుతోంది.

    వీటిలో 15 ఏళ్లు దాటిన పాత బస్సులను తొలగించి స్థానంలో 300 కొత్త బస్సులు, అదనంగా 300 బస్సులు ఉన్నాయి.

    Details

    విద్యుత్ బస్సుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

    డిపోలను ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తూ, అమరావతి కొరకు కేటాయించిన బస్సులను మంగళగిరి డిపోకు, విజయవాడకు విద్యాధరపురం, తిరుపతికి మంగళం డిపోలకు పంపిణీ చేయనున్నారు.

    విశాఖకు సంబంధించిన విద్యుత్ బస్సులు గాజువాక డిపోతో పాటు కొత్తగా ఏర్పాటుచేయనున్న సింహపురి డిపోకు కేటాయిస్తారు.

    సింహపురి డిపో నిర్మాణం కోసం సింహాచలం నుంచి వేపగుంట మార్గంలో సింహపురి కాలనీ వద్ద 4 ఎకరాల స్థలం మంజూరు చేశారు.

    ఈ డిపోల్లో విద్యుత్ బస్సులకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    హెచ్‌టీ లైన్ కోసం విద్యుత్తు శాఖకు ఆర్టీసీ అధికారులు దరఖాస్తు చేసారు, దీనికి సంబంధించి ఖర్చులు కేంద్రమే భరించనుంది.

    Details

    దశల వారీగా వివిధ నగరాల్లో అందుబాటులోకి

    ఈ కొత్త బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి రావడంతో పాటు దశలవారీగా వివిధ నగరాల్లో ప్రయాణికుల సేవలో చేరనున్నారు.

    ఇప్పటివరకు కేటాయించిన బస్సులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు వంటి నగరాల్లో వందల సంఖ్యలో, అమరావతి, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, రాజమహేంద్రవరం, కాకినాడలో 50ల సంఖ్యలో నడపడానికి సిద్ధంగా ఉన్నాయి.

    ఈ బస్సులను పుణె ఆధారిత పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ 'గ్రాస్‌ కాస్ట్ కాంట్రాక్ట్' (జీసీసీ) విధానంలో నిర్వహిస్తుంది.

    Details

    12 మీటర్ల బస్సుకు ప్రతి కిలోమీటర్‌కు రూ.72.55

    మొత్తం 750 బస్సుల్లో 124 బస్సులు 9 మీటర్ల పొడవు కలవు, మిగతా వాటి పొడవు 12 మీటర్లు.

    ఈ బస్సులను 12 ఏళ్ల గడువుతో లేదా 10 లక్షల కిలోమీటర్ల వరకు నడిపేందుకు ఆర్టీసీ, గుత్తేదారు సంస్థ మధ్య ఒప్పందం జరిగింది.

    12 మీటర్ల బస్సుకు ప్రతి కిలోమీటర్‌కు రూ.72.55 చెల్లించాలని, 9 మీటర్ల బస్సుకు రూ.62.12 చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది.

    ఇందులో రూ.24 సబ్సిడీగా కేంద్రం అందజేస్తుంది, మిగిలిన మొత్తం ఆర్టీసీ భరించాల్సి ఉంటుంది.

    గుత్తేదారు సంస్థ రెండు నెలల తరువాత ఈ బస్సులను దశల వారీగా వివిధ నగరాల్లో ప్రవేశపెడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏపీఎస్ఆర్టీసీ

    తాజా

    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ
    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

    ఏపీఎస్ఆర్టీసీ

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  తాజా వార్తలు
    ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం ధర
    Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్! విశాఖపట్టణం
    APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025