NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / APSRTC: విద్యుత్‌ బస్సుల దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ.. 2029 నాటికి 12,717 విద్యుత్‌ బస్సులు ఉండేలా కసరత్తు 
    తదుపరి వార్తా కథనం
    APSRTC: విద్యుత్‌ బస్సుల దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ.. 2029 నాటికి 12,717 విద్యుత్‌ బస్సులు ఉండేలా కసరత్తు 
    విద్యుత్‌ బస్సుల దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ.

    APSRTC: విద్యుత్‌ బస్సుల దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ.. 2029 నాటికి 12,717 విద్యుత్‌ బస్సులు ఉండేలా కసరత్తు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీఎస్‌ఆర్టీసీ విద్యుత్‌ బస్సుల దిశగా ముందడుగు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో డీజిల్‌ బస్సులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేసింది.

    రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2024-29 విద్యుత్‌ వాహనాల విధానం ప్రకారం, 2029 నాటికి ఆర్టీసీ 12,717 బస్సులన్నీ విద్యుత్‌ ఆధారితంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఇందులో సొంతంగా నిర్వహించే 10,155 బస్సులు, అద్దె ప్రాతిపదికన పొందే 2,562 బస్సులున్నాయి.

    ప్రస్తుతం ఉన్న మోటారు వాహన చట్టం ప్రకారం, 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది.

    ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో 15 ఏళ్లు పూర్తి చేసుకునే 2,537 బస్సులను తొలగించి, వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులు తీసుకురానున్నారు.

    వివరాలు 

    2029 నాటికి అదనంగా 1,285 అద్దె బస్సులు

    అదనంగా, నిర్దిష్ట ప్రయాణ దూరం పూర్తిచేసిన వివిధ తరగతుల బస్సులను కూడా పక్కనపెట్టనున్నారు.

    ఈ బస్సుల్లో 12 లక్షల కి.మీ. తిరిగిన ఏసీ బస్సులు, 10 లక్షల కి.మీ. సూపర్‌ లగ్జరీలు, 8 లక్షల కి.మీ. ఎక్స్‌ప్రెస్‌లు, 6.5 లక్షల కి.మీ. తిరుమల ఘాట్‌ సర్వీసులు, 8 లక్షల కి.మీ. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 13 లక్షల కి.మీ. నగర బస్సులు ఉన్నాయి.

    మొత్తం మీద, 2029 నాటికి అదనంగా 1,285 అద్దె బస్సులు, 1,698 కొత్త బస్సులు, 2,726 విద్యుత్‌ బస్సులు చేర్చనున్నారు.

    అయితే, విద్యుత్‌ బస్సుల ప్రణాళిక ఆర్టీసీకి ఆర్థికంగా లాభదాయకమా అనే ప్రశ్న ఇంకా నిలిచే ఉంది.

    వివరాలు 

    ఒక్కో బస్సు కోసం రూ.35 లక్షల మేర  సబ్సిడీ 

    ఒక్కో విద్యుత్‌ బస్సు కొనుగోలుకు రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో ఈ ధరలు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఈ-బస్‌ పథకం కింద రాష్ట్రంలోని 11 నగరాలకు 750 విద్యుత్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన మంజూరు చేసింది.

    విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతిలకు 50 చొప్పున బస్సులు మంజూరయ్యాయి.

    ఒక్కో బస్సు కోసం రూ.35 లక్షల మేరకు కేంద్రం నేరుగా సబ్సిడీ ఇస్తోంది. అదనంగా, ముఖ్యమంత్రి తిరుపతికి 300 విద్యుత్‌ బస్సులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏపీఎస్ఆర్టీసీ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఏపీఎస్ఆర్టీసీ

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  తాజా వార్తలు
    ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం ధర
    Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్! విశాఖపట్టణం
    APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025