NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu: రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఒక సైనికుడికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Jammu: రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఒక సైనికుడికి గాయాలు 
    రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి

    Jammu: రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఒక సైనికుడికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 22, 2024
    08:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలోని గుంధా ఖవాస్ ప్రాంతంలోని కొత్త ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.

    సోమవారం ఉదయం ఉగ్రవాదులు అకస్మాత్తుగా శిబిరంపై కాల్పులు ప్రారంభించారు.

    ఆ తర్వాత సైన్యం ధీటుగా సమాధానం చెప్పడం ప్రారంభించింది. సమాచారం మేరకు ఇరువర్గాల నుంచి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

    రాజౌరీలోని మారుమూల గ్రామంలోని కొత్త సైనిక శిబిరంపై ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడ్డారని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు.

    సమాచారం ప్రకారం, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపుపై కాల్పులు జరిపారు.

    ఇరువైపుల నుంచి కాల్పులు జరగడంతో సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. చుట్టుపక్కల అడవుల్లో ఉగ్రవాదులు దాక్కుని ఉండే అవకాశం ఉంది.

    వివరాలు 

    జమ్మూకశ్మీర్‌లో 500 మంది పారా కమాండోలు 

    గత కొన్ని నెలలుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ప్రతిరోజూ ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌లు లేదా క్యాంపులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

    అదే సమయంలో,జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను అంతం చేసేందుకు సైన్యం కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

    ఇటీవల సైన్యం 3వేల మంది అదనపు సైనికులను మోహరించింది.ఇది కాకుండా జమ్మూకశ్మీర్‌లో 500 మంది పారా కమాండోలను కూడా మోహరించారు.

    వివరాలు 

    దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు పాల్గొన్నారనేది తెలియరాలేదు

    సమాచారం ప్రకారం,ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపుపై దాడి చేసినప్పుడు,కాల్పులు విని గ్రామ ప్రజలు కూడా బయటకు వచ్చారు.

    ఈ దాడిలో కొందరు సైనికులు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.సైన్యం,పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

    గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు పాల్గొన్నారనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.

    అయితే గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులు గుంపులుగా ఏర్పడి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    జమ్ముకశ్మీర్

    JAMMU AND KASHMIR: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన జమ్ముకశ్మీర్‌  ఎన్నికల సంఘం
    PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం  పాకిస్థాన్
    J&K: నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు..ఆర్మీ జవాన్ మృతి,మరొకరికి గాయాలు భారతదేశం
    Jammu and Kashmir: రూ.1.18లక్షల కోట్లు@ పాక్‌కు నిద్రపట్టకుండా చేస్తున్న జమ్ముకశ్మీర్ బడ్జెట్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025