NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి.. 
    తదుపరి వార్తా కథనం
    Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి.. 
    16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కసి, రక్తం వచ్చేలా కొట్టి..

    Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి.. 

    వ్రాసిన వారు Stalin
    Sep 27, 2023
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.

    బాలికను ఆహారం పెట్టకుండా, బట్టలు విప్పి, రక్తస్రావం అయ్యేంత వరకు కొట్టారు.

    అంతేకాకుండా ఆర్మీ మేజర్ శైలేంద్ర యాదవ్, అతని భార్య కిమ్మీ రాల్సన్‌ దంపతులు ఆ బాలికను చెత్త కుండీలోంచి తినమని బలవంతం చేశారు.

    విరిగిన పళ్ళు, కాలిన గుర్తులతో సహా ఆమె శరీరమంతా గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    అయితే నిందితులైన దంపతులు ఈ ఆరోపణలను ఖండించారు. ఆ బాలిక మెట్లపై నుంచి పడిపోవడం వల్లే బాలికకు గాయాలయ్యాయని చెప్పారు.

    ఆర్మీ

    ముక్కు పగుళ్లు, నాలుకపై గాయాలు..

    గత రెండేళ్లలో నిందితురాలైన మహిళ బాధితురాలిని రోలింగ్ పిన్‌తో కొట్టి, ఆమె జుట్టును లాగి, గదిలో బంధించిందినట్లు పోలీసులు తెలిపారు.

    తనపై వేడినీరు పోసినట్లు ఆ బాలిక తాను ఫిర్యాదులో పేర్కొంది. తనను నిర్దాక్షిణ్యంగా కొట్టిన తర్వాత తన రక్తాన్ని తానే నొక్కి బయటకు తీసుకోమ్మని బలవంతం చేసిందని ఆరోపించింది.

    బాలిక ముక్కు పగుళ్లు, నాలుకపై లోతైన కోతలు ఉన్నాయని వైద్య పరీక్షల్లో తేలింది.

    ఇది సోషల్ మీడియాలో లీక్ కావడంతో, పోలీసుల దృష్టికి విషయం వెళ్లింది.

    నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకు దిగారు.

    దీంతో పోలీసులు నిందితులపై పోక్సో, అట్రాసిటీ చట్టం కింద అభియోగాలు మోపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అస్సాం/అసోం
    ఆర్మీ
    తాజా వార్తలు

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న హైకోర్టు
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం

    తాజా వార్తలు

    ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే  ఉత్తర్‌ప్రదేశ్
    సెప్టెంబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ  రామ్‌నాథ్‌ కోవింద్‌
    అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025