NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Free Gas Cylinders: దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు
    తదుపరి వార్తా కథనం
    AP Free Gas Cylinders: దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు
    దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు

    AP Free Gas Cylinders: దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది.

    ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు లబ్దిదారులకు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

    ఉచిత సిలిండర్‌ పొందడానికి, లబ్ధిదారుల వద్ద వైట్ రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలి.

    సూపర్‌ సిక్స్‌ ప్రోగ్రామ్‌ కింద, మహిళలకు 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీని నెలాఖరున ప్రారంభించనున్నామని చెప్పారు.

    రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింప చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

    వివరాలు 

    జీవో జారీ చేయడం

    ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని ప్రతి కుటుంబానికి అందించాలని, జాతీయ స్థాయిలో గ్యాస్ కంపెనీలతో చర్చించి ఈ విధానాలను రూపొందించినట్టు పేర్కొన్నారు.

    సివిల్ సప్లైస్ శాఖ నుండి ప్రతీ కుటుంబానికి వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అందించాలనే ఉద్దేశంతో జీవో జారీ చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు.

    డెలివరీ ప్రారంభం

    అక్టోబర్ 31నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ ప్రారంభమవుతుంది. మొదటి సిలిండర్‌ను అక్టోబర్ 31 నుండి ఎప్పుడైనా అందుకోవచ్చు.

    మార్చి 31లోపు మొదటి సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్‌ ఉన్నవారు రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు సమర్పించి బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

    వివరాలు 

    బుకింగ్ ప్రక్రియ

    ఎల్‌పిజి కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ అందిస్తామని వెల్లడించారు.

    ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న డేటా బేస్‌ను ఆధారం చేసుకొని సిలిండర్ల పంపిణీ చేయనున్నారు.

    ఉచిత గ్యాస్ సిలిండర్లకు అక్టోబర్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. 29 ఉదయం 10 గంటల నుండి బుకింగ్‌లు ప్రారంభమైతే, 31వ తేదీ నుండి డెలివరీ అందించబడుతుంది.

    అర్హత కలిగిన వారికి బుకింగ్ ఖరారు కాగానే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎస్‌ఎంఎస్‌ అందుతుంది.

    వివరాలు 

    ఎప్పుడైనా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు

    గ్యాస్‌ డెలివరీ కోసం రూ.894.92 కోట్ల రూపాయల నగదును అక్టోబర్ 29న ఆయిల్ కంపెనీలకు చెల్లించనున్నారు.

    కేంద్ర ప్రభుత్వం,వివిధ రాష్ట్రాలలో డిబిటిగా నగదు చెల్లిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుండి మార్చి 31 వరకు ఎప్పుడైనా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

    సిలిండర్ పంపిణీ షెడ్యూల్: ఏప్రిల్ 1 నుండి జులై 31లోపు రెండవ సిలిండర్‌ను అందిస్తామని తెలిపారు. ఆగస్టు 1 నుండి నవంబర్ 31 వరకు మూడవ సిలిండర్‌ పంపిణీ ఉంటుందని చెప్పారు.

    ఐటీడీ రిజిస్ట్రేషన్: ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని అమలు చేయడానికి ప్రతి సంవత్సరం రూ. 2684.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.ఎవరికైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేసుకోవచ్చని వివరించారు.

    వివరాలు 

    రేషన్‌ కార్డుల స్థితి

    ప్రస్తుతం రాష్ట్రంలో 1.45 కోట్లు రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న కనెక్షన్లు 9.65 లక్షలుగా మాత్రమే ఉన్నాయని తెలిపారు.

    మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

    అవసరమైన చర్యలు

    కాకినాడలో 52వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్లు, అందులో 29వేల మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యం గుర్తించి 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు మంత్రి వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఆంధ్రప్రదేశ్

    Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు ఆర్థిక శాఖ మంత్రి
    Andhrapradesh: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వంట నూనెల భారీగా తగ్గింపు భారతదేశం
    AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్‌లు చంద్రబాబు నాయుడు
    Liquor Prices: ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ.. ఎంఆర్‌పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025