NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం
    చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం

    Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 20, 2025
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే చెన్నై, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడి నుంచి నడుపుతున్న విషయం తెలిసిందే.

    మార్చిలో మరో ఎనిమిది రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని నిర్ణయించింది. ఈ చర్యతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించి, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

    సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని, చర్లపల్లి స్టేషన్‌ను విస్తరించారు.

    ఇది ప్రతిరోజూ సుమారు 50,000 మంది ప్రయాణికుల రాకపోకలకు ఉపకరించనుంది.

    Details

    40శాతం పనులు పూర్తి

    సరకు రవాణా పార్శిల్‌ కేంద్రం ఏర్పాటుతో పాటు, రైల్వే సౌకర్యాలను విస్తరించారు.

    ప్రస్తుతం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయి. ఈ డిసెంబర్‌ నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

    సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పునరుద్ధరణతో పాటు రోజుకు 200 రైళ్ల రాకపోకలను నిర్వహించడంలో సమతూకం అవసరం ఏర్పడింది.

    ఈ క్రమంలో చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ప్రారంభమవుతాయి. ఇక్కడ రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

    Details

    చర్లపల్లి టెర్మినల్ నుంచి రైళ్లు 

    చెన్నై ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ,

    పుష్‌పుల్‌ (సికింద్రాబాద్-వరంగల్‌), శబరి ఎక్స్‌ప్రెస్, రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ (మధ్యాహ్నం, రాత్రి),

    శాతవాహన ఎక్స్‌ప్రెస్, కాకతీయ ఎక్స్‌ప్రెస్

    కాచిగూడ-మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్

    ప్రయాణికుల భరోసా

    సికింద్రాబాద్‌ పునరాభివృద్ధి పూర్తయ్యే వరకు చర్లపల్లి టెర్మినల్ కీలక కేంద్రంగా మారనుంది. నూతన సేవలతో ప్రయాణికుల ఒత్తిడి తగ్గి, సౌకర్యాలు మరింత మెరుగవుతాయని రైల్వే అధికారులు విశ్వసిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సికింద్రాబాద్
    రైల్వే స్టేషన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025