Page Loader
Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం
చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం

Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే చెన్నై, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడి నుంచి నడుపుతున్న విషయం తెలిసిందే. మార్చిలో మరో ఎనిమిది రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని నిర్ణయించింది. ఈ చర్యతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించి, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని, చర్లపల్లి స్టేషన్‌ను విస్తరించారు. ఇది ప్రతిరోజూ సుమారు 50,000 మంది ప్రయాణికుల రాకపోకలకు ఉపకరించనుంది.

Details

40శాతం పనులు పూర్తి

సరకు రవాణా పార్శిల్‌ కేంద్రం ఏర్పాటుతో పాటు, రైల్వే సౌకర్యాలను విస్తరించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయి. ఈ డిసెంబర్‌ నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పునరుద్ధరణతో పాటు రోజుకు 200 రైళ్ల రాకపోకలను నిర్వహించడంలో సమతూకం అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ప్రారంభమవుతాయి. ఇక్కడ రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Details

చర్లపల్లి టెర్మినల్ నుంచి రైళ్లు 

చెన్నై ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ, పుష్‌పుల్‌ (సికింద్రాబాద్-వరంగల్‌), శబరి ఎక్స్‌ప్రెస్, రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ (మధ్యాహ్నం, రాత్రి), శాతవాహన ఎక్స్‌ప్రెస్, కాకతీయ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్ ప్రయాణికుల భరోసా సికింద్రాబాద్‌ పునరాభివృద్ధి పూర్తయ్యే వరకు చర్లపల్లి టెర్మినల్ కీలక కేంద్రంగా మారనుంది. నూతన సేవలతో ప్రయాణికుల ఒత్తిడి తగ్గి, సౌకర్యాలు మరింత మెరుగవుతాయని రైల్వే అధికారులు విశ్వసిస్తున్నారు.