LOADING...
EVM Strongroom: కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మాయం.. కౌంటింగ్‌కు ఆటంకం
కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మాయం.. కౌంటింగ్‌కు ఆటంకం

EVM Strongroom: కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మాయం.. కౌంటింగ్‌కు ఆటంకం

వ్రాసిన వారు Moogati Shabari
May 04, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మాయమవడంతో పోలింగ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. కౌంటింగ్ డేకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ తాళాలు కనిపించకపోవడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. దీంతో ఓ వ్యక్తి హ్యామర్, చెక్కితో తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేస్తుండగా, భద్రతా సిబ్బంది కట్టుదిట్టంగా గస్తీ కాస్తున్నారు. ఈ గదిలో దావణగేరే సౌత్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ యంత్రాలు ఉన్నాయి.

వివరాలు

మరింత ఆసక్తికరంగా పోటీ..

శామనూర్ శివశంకరప్ప మరణంతో ఈ ఉప ఎన్నికలు నిర్వహించారు. అలాగే బాగల్‌కోట్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపూ ఇదే రోజు జరుగుతోంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై వెంటనే ప్రభావం చూపకపోయినా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీకి ఇది ప్రతిష్టాత్మక పోటీగా మారింది. కాంగ్రెస్‌కు రెండు స్థానాలను కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారగా, బీజేపీ ఈ స్థానాలను దక్కించుకుని అధికార పార్టీకీ గట్టి దెబ్బ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో నాయకత్వంపై అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

వివరాలు

క్షణక్షణం ఉత్కంఠ..

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, బాగల్‌కోట్‌లో 68.74 శాతం పోలింగ్ నమోదవగా, దావణగేరే సౌత్‌లో 68.43 శాతం ఓటింగ్ నమోదైంది. 2028 అసెంబ్లీ ఎన్నికల ముందు తమ బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ ఉప ఎన్నికలను కీలకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్‌కు ఈ రెండు స్థానాలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యంగా మారింది. ఒకవేళ ఓడిపోతే సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల నమ్మకం తగ్గిందనే అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. దావణగేరే సౌత్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ టికెట్ తమకే ఇవ్వాలని ఆ వర్గం బలంగా డిమాండ్ చేసింది. అయితే పార్టీ దివంగత ఎమ్మెల్యే శివశంకరప్ప మనవడు సమర్థ్‌కు టికెట్ ఇచ్చింది.

Advertisement

వివరాలు

కుట్ర జరిగిందని ఆరోపణలు..

పోలింగ్ అనంతరం దావణగేరే సౌత్‌లో అభ్యర్థిని ఓడించేందుకు అంతర్గత కుట్ర జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ముస్లిం నేతలపై చర్యలు కూడా తీసుకుంది. ఇక హౌసింగ్ మంత్రి బీ జడ్ జమీర్ అహ్మద్ ఖాన్‌పై కూడా రాబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చర్యలు తీసుకునే అవకాశముందనే చర్చ సాగుతోంది. దీంతో దావణగేరే సౌత్ ఫలితాలు ఖాన్‌కు కూడా కీలకంగా మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దావణగేరే సౌత్‌లో శివశంకరప్ప, బీజేపీ అభ్యర్థి బీజీ అజయ్ కుమార్‌పై 27,888 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Advertisement