Page Loader
Covid cases: కొత్తగా 760 మందికి కరోనా.. 511కు చేరిన JN.1 కేసులు.. 2 మరణాలు 
Covid cases: కొత్తగా 760 మందికి కరోనా.. 511కు చేరిన JN.1 కేసులు.. 2 మరణాలు

Covid cases: కొత్తగా 760 మందికి కరోనా.. 511కు చేరిన JN.1 కేసులు.. 2 మరణాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 04, 2024
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

Covid 19 Update: దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 760 కొత్త కోవిడ్ -19కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కారణంగా కొత్తగా ఇద్దరు మణించారు. కర్ణాటకలో ఒకరు, కేరళలో మరొకరు చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 511కరోనా వైరస్ సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,33,373కి చేరుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ -19 నుండి 775 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు (4,44,78,047) చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Details 

జాతీయ రికవరీ రేటు 98.81 శాతం

మంత్రిత్వ శాఖ ప్రకారం, జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 2020 జనవరిలో దేశంలో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుండి ఇప్పటివరకు దేశంలో 4.50 కోట్ల కేసులు (4,50,15,843) నమోదయ్యాయి. భారతదేశంలో బుధవారం, 602 తాజా కోవిడ్ -19 కేసులు, సంక్రమణ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయి . డిసెంబర్ 5 వరకు రోజువారీ కోవిడ్-19 కేసుల రెండంకెలకు మించలేదు. JN.1సబ్-వేరియంట్ ఉద్ధృతి నేపథ్యంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కర్ణాటకలో 199,కేరళలో 148,గోవాలో 47, గుజరాత్‌లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణ నుంచి 2, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు.