NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి
    తదుపరి వార్తా కథనం
    New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి
    'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి

    New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    04:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసిన కొత్త పంబన్‌ బ్రిడ్జి (New Pamban Bridge) చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.

    తమిళనాడులోని రామేశ్వరంలో ప్రారంభం కానున్న ఈ తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి, 105 సంవత్సరాల పాత పంబన్‌ వంతెన స్థలంలో నిర్మించబడుతోంది.

    ఈ బ్రిడ్జి సాంకేతికంగా అత్యాధునికంగా రూపోందించబడింది, కాబట్టి దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు.

    మాజీ పంబన్‌ రైలు వంతెన 1914లో నిర్మించబడినప్పటి నుండి రామేశ్వరం,ప్రధాన భూభాగం మధ్య నావిగేషన్‌ను నిర్వహించేదిగా ఉండింది.

    అయితే, అది ఫొరితిపట్టిన కారణంగా,సేవలు నిలిపివేయబడినవి. అందులోనే, కొత్త పంబన్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    వివరాలు 

    మీటర్‌గేజ్‌ నుండి బ్రాడ్‌గేజ్‌కి వంతెన మార్పు..

    ఈ బ్రిడ్జి డిజైన్‌లో కొత్త టెక్నాలజీలు, వేగాన్ని పెంచే విధంగా మార్పులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

    రామనాథపురం జిల్లాలో,1914లో పంబన్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగింది,ఇది సముద్రంలో 2.06 కి.మీ. పొడవుగల వంతెనగా మారింది.

    అప్పట్లో దాని నిర్మాణం కోసం 20లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 2006-07 సంవత్సరంలో ఈ వంతెనను మీటర్‌గేజ్‌ నుండి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు.

    ఈ వంతెనను తెరవడానికి 16మంది కార్మికులు పనిచేయాల్సి ఉండేది. కానీ, కొత్త పంబన్‌ బ్రిడ్జి, ట్రాక్‌ ఉన్న వంతెనను పైకి లిఫ్ట్‌ చేసే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించబడింది.

    మార్చి 2019లో, ఈ కొత్త పంబన్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అశ్విని వైష్ణవ్‌ షేర్ చేసిన న్యూ పంబన్ బ్రిడ్జ్

    🚆The New Pamban Bridge: A modern engineering marvel!

    🧵Know the details 👇🏻 pic.twitter.com/SQ5jCaMisO

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025