Page Loader
New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి
'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి

New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసిన కొత్త పంబన్‌ బ్రిడ్జి (New Pamban Bridge) చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. తమిళనాడులోని రామేశ్వరంలో ప్రారంభం కానున్న ఈ తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి, 105 సంవత్సరాల పాత పంబన్‌ వంతెన స్థలంలో నిర్మించబడుతోంది. ఈ బ్రిడ్జి సాంకేతికంగా అత్యాధునికంగా రూపోందించబడింది, కాబట్టి దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు. మాజీ పంబన్‌ రైలు వంతెన 1914లో నిర్మించబడినప్పటి నుండి రామేశ్వరం,ప్రధాన భూభాగం మధ్య నావిగేషన్‌ను నిర్వహించేదిగా ఉండింది. అయితే, అది ఫొరితిపట్టిన కారణంగా,సేవలు నిలిపివేయబడినవి. అందులోనే, కొత్త పంబన్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వివరాలు 

మీటర్‌గేజ్‌ నుండి బ్రాడ్‌గేజ్‌కి వంతెన మార్పు..

ఈ బ్రిడ్జి డిజైన్‌లో కొత్త టెక్నాలజీలు, వేగాన్ని పెంచే విధంగా మార్పులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రామనాథపురం జిల్లాలో,1914లో పంబన్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగింది,ఇది సముద్రంలో 2.06 కి.మీ. పొడవుగల వంతెనగా మారింది. అప్పట్లో దాని నిర్మాణం కోసం 20లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 2006-07 సంవత్సరంలో ఈ వంతెనను మీటర్‌గేజ్‌ నుండి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. ఈ వంతెనను తెరవడానికి 16మంది కార్మికులు పనిచేయాల్సి ఉండేది. కానీ, కొత్త పంబన్‌ బ్రిడ్జి, ట్రాక్‌ ఉన్న వంతెనను పైకి లిఫ్ట్‌ చేసే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించబడింది. మార్చి 2019లో, ఈ కొత్త పంబన్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అశ్విని వైష్ణవ్‌ షేర్ చేసిన న్యూ పంబన్ బ్రిడ్జ్