NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: 'బుల్‌డోజర్' చర్యపై అస్సాం ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు 
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: 'బుల్‌డోజర్' చర్యపై అస్సాం ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు 
    'బుల్‌డోజర్' చర్యపై అస్సాం ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

    Supreme Court: 'బుల్‌డోజర్' చర్యపై అస్సాం ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 30, 2024
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టు ఆదేశాలను అస్సాం ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి.

    కామరూప్ మెట్రో డిస్ట్రిక్ట్‌లోని సోనపుర్ మువాజ్ ప్రాంతానికి చెందిన 47 మంది పౌరులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

    ఈ పిటిషన్‌ను నేడు జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ పరిశీలించింది.

    రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో స్పందించాల్సిందిగా సూచించింది, ఈ సమయంలో కూల్చివేతలను ఆపాల్సిందిగా కూడా పేర్కొంది.

    సుప్రీం కోర్టు ఆదేశాల లేకుండా దేశంలో ఎక్కడా కూల్చివేతలు చేపట్టకూడదని సెప్టెంబర్ 17న న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, అస్సాం ప్రభుత్వం ఈ ఆదేశాలను ఉల్లంఘించిందని న్యాయవాది హౌజెఫా అహ్మదీ తెలిపారు.

    వివరాలు 

    నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ చేసి కూల్చివేతలు 

    సోనపుర్‌లో అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ చేసి కూల్చివేతలు ప్రారంభించినట్లు న్యాయస్థానానికి సమాచారం అందించారు.

    గువహటి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన ప్రమాణపత్రం ఆధారంగా, విచారణ పూర్తయ్యేవరకు కూల్చడమంటూ వెల్లడించినప్పటికీ, కూల్చివేతలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.

    సోనపుర్‌లోని కచుతొలి పథార్ గ్రామానికి చెందిన 47 కుటుంబాలకు చెందిన ఇళ్లు కూల్చివేయాలని నిర్ణయించారని సమాచారం.

    వివరాలు 

    నిర్మాణాలను కూల్చడానికి న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి

    అక్కడి వారు అసలు భూయజమానుల నుంచి భూమిని కొనుగోలు చేసి పవర్ ఆఫ్ అటార్నీ పొందినట్లు అధికారులకు తెలియజేశారు.

    కానీ, బాధితులు చెప్పిన ప్రకారం, ప్రభుత్వ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారు.

    రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, వాటర్‌బాడీలు వంటి నిర్మాణాలను తప్పించి, మిగతా నిర్మాణాలను కూల్చడానికి న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి అని కోర్టు సెప్టెంబర్ 17న తెలిపింది.

    అయినప్పటికీ, తమ ఇళ్ల కూల్చివేతపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    అస్సాం/అసోం

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    సుప్రీంకోర్టు

    Supreme Court: సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ పిటిషన్‌.. విచారించనున్న సుప్రీంకోర్టు  భారతదేశం
    Supreme Court: సుప్రీం కీలక తీర్పు.. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు తెలంగాణ
    Patanjali Ayurved products' ban: 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపేసిన పతంజలి.. సుప్రీంకోర్టుకి సమాచారం ఇచ్చిన కంపెనీ   పతంజలి
    Supreme Court: దుకాణాలపై పేరు-గుర్తింపు అవసరం లేదు.. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించిన సుప్రీం భారతదేశం

    అస్సాం/అసోం

    అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం  గువాహటి
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!  బీజేపీ
    బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు బంగ్లాదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025