NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
    తదుపరి వార్తా కథనం
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం

    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

    వ్రాసిన వారు Stalin
    Mar 02, 2023
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

    త్రిపురలోని మొత్తం 60అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. నాగాలాండ్, మేఘాలయలో 59స్థానాల చొప్పున ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది.

    నాగాలాండ్‌లో 60స్థానాలు ఉండగా అకులుటో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేఘాలయలో కూడా 60స్థానాలు ఉండగా, సోహియాంగ్ స్థానంలో నిలబడిన అభ్యర్థి మృతి చెందడంతో పోలింగ్ వాయిదా పడింది.

    ఈ ఎన్నికల్లో త్రిపురలో 86.10శాతం పోలింగ్ నమోదైంది. 2018ఎన్నికలలో ఓటింగ్ శాతం కంటే ఈ సారి కొంచెం తక్కువగా నమోదైంది. మేఘాలయలోని 77.55 శాతం, నాగాలాండ్‌లో 85.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో బీజేపీ, మేఘాలయలో హంగ్, నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి

    ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు.

    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌రాష్ట్రాల్లో తొలిసారిగా 60అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో కౌంటింగ్ పరిశీలకుడిని ఎన్నికల సంఘం నియమించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులని కౌంటింగ్ పరిశీలకులుగా నియమించినట్లు సీఈవో గిత్తె కిరణ్‌కుమార్ దినకరరావు ప్రకటించారు. త్రిపురలోని 21 హాళ్లలో మూడంచెల భద్రతతో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

    త్రిపురలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయలో హంగ్ వస్తుందని, నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి రెండోసారి అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. అవి నిజమవుతాయా? లేదా? అనేది కొద్ది గంటల్లో తేలనుంది.

    మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జార్ఘండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    త్రిపురలో కౌంటింగ్ కేంద్రం వద్ద వివిధ పార్టీల నేతల సందడి

    Agartala, Tripura| Vote counting to begin at 8 AM. Visuals from counting centre, Umakanta Academy Complex pic.twitter.com/GB5GoQfqmh

    — ANI (@ANI) March 2, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మహారాష్ట్రలో ప్రారంభమైన ఉప ఎన్నికల కౌంటింగ్

    Pune, Maharashtra | Counting of votes underway for Kasba Peth by-elections pic.twitter.com/CUp88aRSL3

    — ANI (@ANI) March 2, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేఘాలయలో కౌంటింగ్ కేంద్రం వద్ద నాయకుల హడావుడి

    Counting of votes for #MeghalayaElections2023 underway; visuals from counting centre at Extension Training Centre in Tura pic.twitter.com/gteTnGBn3y

    — ANI (@ANI) March 2, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసెంబ్లీ ఎన్నికలు
    త్రిపుర
    నాగాలాండ్

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం కాంగ్రెస్
    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం మానిక్ సాహా

    నాగాలాండ్

    మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ
    నాగాలాండ్: 60ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో మహిళకు దక్కని ప్రాతినిధ్యం; ఈసారైనా అబల గెలిచేనా? అసెంబ్లీ ఎన్నికలు
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025