NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
    తదుపరి వార్తా కథనం
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం

    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్‌లో జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డాతో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు సమావేశమయ్యారు.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతారనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల సమావేశం ఆసక్తికరంగా మారింది.

    ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ ఎలా ఎదుర్కొవాలనే దానిపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాఖ చీఫ్ సంజయ్ బండి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఉన్నారు.

    బీజేపీ

    దిల్లీ మద్యం కేసులో కవితను టార్కెట్ చేయాలని అధిష్ఠానం సూచన!

    బీఆర్ఎస్‍తో పాటు కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శస్త్రాలను ఎక్కుపెట్టాలని బీజేపీ ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని దిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారిన దిల్లీ మద్యం కేసును అస్త్రంగా చేసుకొని కేసీఆర్‌పై మాటల దాడికి దిగాలని కేంద్రం నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.

    కేసీఆర్ కుమార్తె కవిత ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు కవితను టార్గెట్ చేసారు. తర్వాత టార్గెట్ కవితేనని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

    దీనికి తోడు బీజేపీ ప్రజా గోసా, బీజేపీ భరోసా, ప్రజా సంగ్రామ యాత్రపై మరింత దృష్టి సారించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలు
    అమిత్ షా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు ఆంధ్రప్రదేశ్
    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    హైదరాబాద్ హై'టెక్' పోలీస్: సైబర్ యూనిట్ బలోపేతానికి 'ఏఐ' సపోర్టు భారతదేశం

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? ధర్మపురి
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు ట్విట్టర్

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ త్రిపుర
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం

    అమిత్ షా

    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025