NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం 
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం 
    ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం

    Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం 

    వ్రాసిన వారు Stalin
    Jul 19, 2023
    02:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీలో అలకనంద నది ఒడ్డున వంతెనపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15మంది చనిపోయారు.

    మృతుల్లో ఒక పోలీసు, ఐదుగురు హోంగార్డు సిబ్బంది కూడా ఉన్నారు.

    నమామి గంగే ప్రాజెక్టు స్థలంలో బాధితులు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

    నమామి గంగే ప్రాజెక్టులో భాగమైన ఈ వంతెన అలకనంద నదిపై ఉంది.

    ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి జరిగింది. తొలుత ఓ వాచ్‌మెన్ విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది.

    పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా, చాలా మంది విద్యుదాఘాతానికి గురయ్యారు. 10మంది సంఘటనా స్థలంలో మృతి చెందగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

    ఉత్తరాఖండ్

    విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 

    ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.

    ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, ఎస్‌డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామమని సీఎం పేర్కొన్నారు.

    క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తున్నామని సీఎం చెప్పారు.

    రైలింగ్‌లో విద్యుత్ ప్రవాహం కారణంగానే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఐదుగురు హోంగార్డు సిబ్బందితో సహా 15 మంది మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఉత్తరాఖండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు.

    క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాదంపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం

    यह बेहद दुखद घटना है। पुलिस, SDRF और बचाव दल मौके पर उपस्थित हैं। घटना के जांच के भी आदेश दिए गए हैं। दोषी के खिलाफ कठोर कार्रवाई की जाएगी: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी, देहरादून

    चमोली जिले में अलकनंदा नदी के किनारे ट्रांसफार्मर फटने से 15 लोगों की मृत्यु हुई है। https://t.co/bZS7NyIFBJ pic.twitter.com/LnPOWXXYpi

    — ANI_HindiNews (@AHindinews) July 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    విద్యుత్
    తాజా వార్తలు
    పుష్కర్ సింగ్ ధామి

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    కేరళలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈ ప్రదేశాల గురించి తెలుసుకోండి కేరళ
    US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ  భూకంపం
    కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ  ముంబై

    పుష్కర్ సింగ్ ధామి

    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025