ఉత్తరప్రదేశ్లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు
ఉత్తర్ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడ్ని ఓ సాధువు పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల ఓం ప్రాకష్ సప్తకోసి అనే సాధువు యాత్ర చేపట్టాడు. అయితే మథుర జిల్లాలోని గోవర్ధన ప్రాంతానికి చేరకున్న అతడు ఉన్నట్టుండి వితంగా ప్రవర్తించి, ఓ బాలుడిని భుజానికి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత బాలుడి కాళ్ల పట్టుకొని పలుమార్లు నేలకేసి కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.