NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ
    బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 17, 2023
    04:13 pm
    బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ
    బిలియనీర్ జార్జి సోరోస్‌పై అగ్రహం వ్యక్తం చేసిన స్మృతి ఇరానీ

    అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేపుతున్నారు. తాజాగా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జార్టి సోరోస్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.కొన్ని విదేశీ శక్తులు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జార్జి సోరోస్ తన శక్తియుక్తులను ఇండియాకు కాకుండా తన దేశానికి లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తుంటారని, అదానీ గ్రూప్ అంశంపై ఆయన ఆలోచనా ప్రక్రియ, ప్రకటనలను భారతీయులంతా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ ప్రజాస్వామ్యం ఎప్పటికీ చెక్కుచెదరదని, భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోదీ నాయకత్వంలో బలంగా ఎదుర్కుంటామని అన్నారు

    2/2

    జార్జ్ సోరోస్‌కు ప్రతి భారతీయుడూ సమాధానం ఇవ్వాలి

    భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్‌ అదానీ ఇటీవలి కాలంలో స్టాక్‌ మార్కెట్‌లో ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ జార్జ్ సోరోస్ చెప్పారు. జార్జి సోరోస్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకోవడం సిగ్గుచేటు అని స్మృతి ఇరానీ అన్నారు. జార్జ్ సోరోస్‌కు తగిన సమాధానం ప్రతి భారతీయుడూ ఇవ్వాలని కోరారు. ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంపై ప్రధాని మోదీని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో పాటు, ఇంగ్లాడ్ ప్రధాని బహిరంగంగా ప్రశంసించారని, ఇలాంటి తరుణంలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆమె తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    స్మృతి ఇరానీ
    ప్రధాన మంత్రి

    స్మృతి ఇరానీ

    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ రాహుల్ గాంధీ
    లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం  రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి రాహుల్ గాంధీ

    ప్రధాన మంత్రి

    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023