NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
     MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం
    సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం

     MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 24, 2025
    09:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది.

    సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై జరిగిన అత్యాచారయత్నం కలకలం రేపుతోంది.

    రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించగా, అతని నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడింది.

    దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

    Details

    కదులుతున్న రైలు నుంచి దూకేసిన బాధితురాలు

    బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 23 ఏళ్ల యువతి. హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తోంది.

    ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి, అక్కడి నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.

    ఆమె సెల్‌ఫోన్ రీఫెరింగ్ చేయించుకుని తిరిగి మేడ్చల్‌కు వెళ్లేందుకు ఉమెన్స్ కోచ్‌లో ఎక్కింది.

    అయితే అప్పటికే బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోవడంతో, కోచ్‌లో ఆమె ఒక్కతే మిగిలిపోయింది.

    అంతలో 25 ఏళ్ల యువకుడు బోగీలోకి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని లైంగిక దాడికి యత్నించాడు.

    అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమె, కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసింది.

    Details

    కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

    కోంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైంది.

    స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.

    అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జ్ చేసిన వైద్యులు, ఆమె వద్ద నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

    దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ఇండియా

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    హైదరాబాద్

    Hyderabad : నార్సింగి గుట్టపై జంట హత్యలు.. దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు హత్య
    Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం.. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లు  భారతదేశం
    Hyderabad Literary Festival: హైదరాబాద్‌ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ భారతదేశం
    Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం.. అమిత్‌ కుమార్‌ గ్యాంగ్‌ కోసం పోలీసుల ముమ్మర వేట  భారతదేశం

    ఇండియా

    Nara Lokesh:  ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గీతం యూనివర్శిటీలో మెగా కెరీర్ ఫెయిర్  ఆంధ్రప్రదేశ్
    Sam Pitroda: ఐఐటీ రాంచీ తర్వాత.. రూర్కీలోనూ జూమ్‌ మీటింగ్‌ హ్యాక్.. శామ్‌ పిట్రోడా ఆరోపణ  కాంగ్రెస్
    IIT Baba: న్యూస్‌రూమ్‌లో ఐఐటీ బాబాపై దాడి! నోయిడా
    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. మంచు చరియల కింద చిక్కుకున్న 8 మంది ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025