ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్కు చెందిన శ్వేత మాధగాని అనే వివాహిత ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని జిలాంగ్కు పశ్చిమాన ఉన్న బక్లీ వద్ద హైవే పై ఉన్న డబ్బాలో శ్వేత మృతదేహం లభ్యమైంది. మృతురాలు తన భర్త అశోక్ రాజ్, మూడేళ్ల కొడుకుతో కలిసి పాయింట్ కుక్లో నివాసం ఉంటోంది. ఆస్ట్రేలియా మిర్కావే పాయింట్ కుక్లో భర్త అశోక్ రాజ్ వరికుప్పలతో కలిసి శ్వేత నివసిస్తున్నారు. శ్వేత మాధగాని మృతిపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. శ్వేతను హత్య భర్త హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల శ్వేత భర్త అస్ట్రేలియా నుంచి హైదరాబాద్ రావడంపై పోలీసులు అనుమానాలు మరింత పెరిగాయి.