LOADING...
Ayodhya Ram Mandir: 40 రోజుల్లో 70 చోరీలు.. అయోధ్య విరాళాల దుర్వినియోగంలో సంచలన విషయాలు
40 రోజుల్లో 70 చోరీలు.. అయోధ్య విరాళాల దుర్వినియోగంలో సంచలన విషయాలు

Ayodhya Ram Mandir: 40 రోజుల్లో 70 చోరీలు.. అయోధ్య విరాళాల దుర్వినియోగంలో సంచలన విషయాలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలోని రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహించిన విచారణలో నిందితులు విరాళాల నగదును కాజేయడానికి పలు అక్రమ పద్ధతులను అనుసరించినట్లు తేలింది. ఆలయంలో పలుమార్లు చోరీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రహస్య కెమెరాల ద్వారా రికార్డు అయిన వారం రోజుల ఫుటేజీని పరిశీలించగా, ఒక ఉద్యోగి సీసీటీవీ కెమెరా దృశ్యాన్ని అడ్డుకునేలా నిలబడగా, మరోవైపు అతని సహచరులు నగదును తమ దుస్తుల్లో దాచుకుని రహస్యంగా తరలిస్తున్న దృశ్యాలు గుర్తించారు.

వివరాలు

40 రోజుల్లోనే 70 చోరీలు..అధికారులు షాక్

అనంతరం దొంగిలించిన నగదును ఆలయ ప్రాంగణంలోని స్నానాల గదుల్లో దాచిపెట్టి, అనుకూల సమయంలో బయటకు తీసుకెళ్లేవారని సిట్ వెల్లడించింది. అంతేకాకుండా, నగదును బ్యాంకుకు తరలించే సమయంలో కూడా డబ్బు కట్టల నుంచి కొన్ని నోట్లను మళ్లించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 వరకు కేవలం 40 రోజుల వ్యవధిలో సుమారు 70 చోరీలు జరిగినట్లు సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.79.85 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో పలువురు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం.

వివరాలు

చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా..

భక్తులు విరాళాల పెట్టెల్లో సమర్పించిన బంగారు ఆభరణాలు కూడా నిందితుల చేతికి చిక్కినట్లు విచారణలో తేలింది. వీటిలో బాలరాముడి విగ్రహానికి సమర్పించిన చెవిపోగులు, ముక్కుపుడకలు, గాజులు, కాలి గజ్జెలు వంటి విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఈ కేసులో మరో కీలక పరిణామంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.

Advertisement

వివరాలు

8 మంది అరెస్ట్..

తన మాజీ డ్రైవర్ రామ్‌శంకర్ యాదవ్ అరెస్టుకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర కూడా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో చంపత్ రాయ్ మాజీ డ్రైవర్‌తో పాటు నగదు లెక్కింపు విభాగాధిపతి, ఓ విశ్రాంత బ్యాంకు అధికారి కూడా ఉన్నారు. ఈ నిందితులందరికీ స్థానిక కోర్టు శుక్రవారం మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Advertisement