Page Loader
Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు 
Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు

Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు 

వ్రాసిన వారు Stalin
Jun 22, 2024
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే (నర్సీపట్నం) చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్‌ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన ఎన్నికను సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ అయ్యన్నపాత్రుడ్ని స్పీకర్ స్థానంలో కూర్చుండబెట్టారు. అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడిని పలకరించి తన రాజకీయ నేపథ్యాన్ని వివరించారు. అయ్యన్నపాత్రుడు ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారని చెప్పారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా 16 ఏళ్లు పనిచేశారని సీఎం చెప్పారు. స్పీకర్‌ను ఫైర్‌బ్రాండ్‌గా అభివర్ణించారు.

వివరాలు 

నర్సీపట్నంతో అయ్యన్నపాత్రుడికి 40 ఏళ్లు అనుబంధం

నర్సీపట్నంతో అయ్యన్నపాత్రుడికి 40 ఏళ్లుగా అనుబంధం ఉందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారని, గోదావరి జలాల కోసం పోరాడారని చంద్రబాబు నాయుడు అన్నారు. అయ్యన్నపాత్రుడు తన రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగారన్నారు. అంతేకాకుండా, గతసారి అసెంబ్లీ సమావేశాలు దుర్భాషలాడుతూ, ఎమ్మెల్యేలను అవహేళన చేస్తూ దుర్మార్గంగా, నీచంగా జరిగాయని నాయుడు ఆరోపించారు. తనపై, తన కుటుంబంపై అప్పటి ప్రభుత్వం నీచమైన వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. తనను ప్రకటన చేయడానికి మైక్ కూడా ఇవ్వలేదని అన్నారు.