NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kanaka Durga Temple: కనక దుర్గమ్మ గుడిలో నాసిరకం సరుకులు..! ప్రభుత్వం సీరియస్ 
    తదుపరి వార్తా కథనం
    Kanaka Durga Temple: కనక దుర్గమ్మ గుడిలో నాసిరకం సరుకులు..! ప్రభుత్వం సీరియస్ 
    కనక దుర్గమ్మ గుడిలో నాసిరకం సరుకులు..! ప్రభుత్వం సీరియస్

    Kanaka Durga Temple: కనక దుర్గమ్మ గుడిలో నాసిరకం సరుకులు..! ప్రభుత్వం సీరియస్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2024
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనకదుర్గమ్మ ఆలయంలో నాసిరకం సరుకుల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

    దేవాదాయ శాఖ యంత్రాంగం ఈ విషయంపై అంతర్గత విచారణ చేపట్టింది.

    తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజుల తనిఖీల్లో భాగంగా రూ. 15 లక్షల విలువైన నాసిరకం సరుకులను గుర్తించారు.

    ఈ సందర్భంగా అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై ఒక నివేదిక సిద్ధం చేయనున్నారు.

    FSSAI ప్రమాణాలకు విరుద్ధంగా సరుకులు వస్తున్నా, అధికార యంత్రాంగం ఎందుకు గుర్తించలేదో అన్న విషయంపై రిపోర్ట్ ప్రశ్నించింది.

    Details

    దుర్గగుడిపై దృష్టి సారించిన ప్రభుత్వం

    నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

    అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారీ విభాగాల్లో నాసిరకం సరుకులను గుర్తించడంలో ఉద్యోగులు నిర్లక్ష్యం చూపించడంతో, వాటి సరైన ప్రమాణాలను చెల్లించడం లేదు.

    ఈ అంశంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అధికారుల వర్గాల నుండి సమాచారం అందుతోంది.

    ఇటీవల తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం రేపగా, దుర్గగుడిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.

    నాసిరకం సరుకుల గురించి జరుగుతున్న ఈ విచారణ, ఆలయాల విశ్వసనీయతను పునరుద్ధరించడానికి తీసుకుంటున్న చర్యలో భాగమని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయవాడ కనకదుర్గ గుడి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్! విజయనగరం
    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్

    విజయవాడ కనకదుర్గ గుడి

    సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా? ఎన్‌టీఆర్ జిల్లా
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  హైదరాబాద్
    దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం దసరా నవరాత్రి 2023
    విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు  తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్

    Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు భారతదేశం
    Floods: ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. జలాశయాలకు పోటెత్తిన వరద భారతదేశం
    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...! కేంద్ర ప్రభుత్వం
    APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025