NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ban On Mobiles: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Ban On Mobiles: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
    స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    Ban On Mobiles: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2023
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది.

    విద్యార్థులు పాఠశాలల్లోకి ఫోన్లు తేవడాన్ని బ్యాన్ చేసిన ప్రభుత్వం, ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్స్ తీసుకురావొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

    టీచర్లు తరగతి గదుల్లోకి వెళ్లేముందు తమ మొబైల్స్‌ను ప్రిన్సిపల్ కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దిల్లీ ప్రభుత్వం కూడా ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

    Details

    నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

    యూనెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు ఆధారంగా బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్నితీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

    ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

    ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధనలు అమలయ్యేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా
    Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్

    ఆంధ్రప్రదేశ్

    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్
    పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ ప్రభుత్వం
    పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు పోలవరం
    అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు అన్నమయ్య జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025