NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Banglore: వింగ్ కమాండర్ పై దాడి కేసులో కొత్త మలుపు, IAF అధికారిపై కేసు నమోదు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Banglore: వింగ్ కమాండర్ పై దాడి కేసులో కొత్త మలుపు, IAF అధికారిపై కేసు నమోదు
    వింగ్ కమాండర్ పై దాడి కేసులో కొత్త మలుపు, IAF అధికారిపై కేసు నమోదు

    Banglore: వింగ్ కమాండర్ పై దాడి కేసులో కొత్త మలుపు, IAF అధికారిపై కేసు నమోదు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 22, 2025
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత వైమానిక దళానికి చెందిన వింగ్‌ కమాండర్‌ బోస్‌పై బెంగళూరులో జరిగిన దాడి ఘటన తాజాగా సంచలనం రేపుతోంది.

    ఆయన భార్య మధుమిత, స్వయంగా ఒక స్క్వాడ్రన్ లీడర్‌ కూడా కాగా,ఈదంపతులు ఇద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో,కొందరు ద్విచక్రవాహనదారులు వారిని అడ్డగించి దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.

    ఈసంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ తాజాగా బయటకు వచ్చింది. అయితే ఆ దృశ్యాల్లో మొదట బోస్‌ దాడికి దిగినట్లుగా కనిపిస్తోంది.

    సీసీటీవీ వీడియోల ప్రకారం,ఫుట్‌పాత్‌పై నిల్చొని ఉన్న వికాస్‌ కుమార్‌ అనే వ్యక్తిపై ముందుగా బోస్‌ దాడికి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

    ఆ తర్వాత బోస్‌ను అడ్డుకునేందుకు వచ్చిన మిగతా వ్యక్తులపై కూడా ఆయన హింసాత్మకంగా ప్రవర్తించినట్లు ఆ ఫుటేజ్‌ ద్వారా తెలుస్తోంది.

    వివరాలు 

    వింగ్‌ కమాండర్‌ బోస్‌ ముఖం నుంచి రక్తస్రావం

    అయితే, ఈ ఘటనలో ఒకవైపు వ్యక్తులే బాధితులుగా ఉన్నారన్న అనుమానాల మధ్య, ఇది వింగ్‌ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని చేయబడిన దాడి కాదని, ఇరు పక్షాల మధ్య ఉద్భవించిన ఘర్షణగా భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

    ఈ తగాదాకు నిజమైన కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ఒక పోలీసు అధికారి వెల్లడించారు.

    ఈ ఘటనపై బెంగళూరు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ దేవరాజ్‌ మాట్లాడుతూ,ఇది పరస్పర దాడిగా కనిపిస్తున్నదని చెప్పారు.

    వింగ్‌ కమాండర్‌ బోస్‌ ముఖం నుంచి రక్తస్రావం కావడంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు.

    అక్కడ వారికి తక్షణ చికిత్స అందించిన తరువాత,ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమంటే ఆయనకు విమాన ప్రయాణానికి సమయం కావడంతో వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.

    వివరాలు 

    బోస్‌పై వికాస్‌ కుమార్‌ హత్యాయత్నం 

    తర్వాత బోస్‌ ఒక వీడియోను విడుదల చేయడంతో ఆయన భార్య మధుమితను గుర్తించి సంప్రదించామని,ఆమె స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

    దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

    అందులో భాగంగా బోస్‌పై వికాస్‌ కుమార్‌ను హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. త్వరలోనే బోస్‌ను కూడా విచారించనున్నట్లు సమాచారం.

    బోస్‌ విడుదల చేసిన వీడియోలో ఆయన ముఖం, మెడ నిండి రక్తస్రావం కావడం స్పష్టంగా కనిపిస్తోంది.

    ఆ సమయంలో ఆయన భార్యే కారు నడుపుతున్నారు.

    వివరాలు 

    కారుపై ఉన్న డీఆర్‌డీఓ స్టిక్కర్‌

    ఆ వీడియోలో బోస్‌ మాట్లాడుతూ, "మేము కారు లో ప్రయాణిస్తుండగా, బైక్‌పై వచ్చిన కొందరు వ్యక్తులు మమ్మల్ని అడ్డగించారు. వారు మొదట మమ్మల్ని తిడుతూ మా కారుపై ఉన్న డీఆర్‌డీఓ స్టిక్కర్‌ను చూశారు. వారు నా భార్యపై అసభ్యంగా మాటలాడటంతో సహించలేక, నేను కారులో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు ఒక్క వ్యక్తి తన కీతో నా ముఖంపై గట్టిగా కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తంతో నిండి పోయింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని నేను గట్టిగా మాట్లాడాను".

    వివరాలు 

    వ్యక్తి రాయితో కారును ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు 

    అయితే, అక్కడికి ఇంకా చాలామంది వ్యక్తులు చేరుకుని వారిని దూషించడం మొదలుపెట్టారని, ఒక వ్యక్తి రాయితో కారును ధ్వంసం చేయాలని, తన తలపై దాడి చేయాలని ప్రయత్నించినట్లు బోస్ వివరించారు.

    ఈ పరిణామాలపై ఆయన భార్య వెంటనే అప్రమత్తమై తనను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు చెప్పారు.

    అక్కడ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా స్పందన తక్కువగా కనిపించిందని,రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేసినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    బెంగళూరు

    NCA: బెంగళూరులో కొత్త 'ఎన్‌సీఏ' ప్రారంభం.. బీసీసీఐ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు  బీసీసీఐ
    Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్‌.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం ఫ్లిప్‌కార్ట్
    Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు  కర్ణాటక
    Ratan Tata: ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌ విమానాన్ని నడిపిన రతన్‌ టాటా.. జెట్‌ విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు లైసెన్స్‌  రతన్ టాటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025