NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టోల్‌ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్ 
    తదుపరి వార్తా కథనం
    టోల్‌ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్ 
    కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్

    టోల్‌ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    06:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థను అమలుకు కేంద్రం నడుం బిగించింది. అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

    ఈ మేరకు జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఆగకుండానే గేట్ దాటేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే కొత్త టోల్‌ వ్యవస్థను వినియోగంలోకి తీసుకురానున్నట్లు కేంద్ర రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద అర నిమిషం కూడా ఆగాల్సిన పని లేదన్నారు.

    ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ విధానం స్థానంలో అవాంతరాలు లేని టోల్‌ వ్యవస్థ లేదా ఓపెన్‌ టోల్‌ విధానం అమలు కోసం ట్రయల్స్ కొనసాగుతున్నట్లు చెప్పారు.

    DETAILS

    నిరీక్షించే సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువగా కుదించడమే మా లక్ష్యం : వీకే సింగ్

    పరీక్షలు విజయవంతం కాగానే అమల్లోకి తీసుకొస్తామని కేంద్రమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. ఈ నూతన సిస్టమ్ ద్వారా సామర్థ్యం మరింత మెరుగుపడి ప్రయాణ సమయం కలిసి వస్తుందన్నారు.

    ప్రస్తుతం ఫాస్టాగ్‌ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ టైమ్ 47 సెకన్లకు తగ్గించగలిగామన్నారు. ఇప్పుడు దీన్ని 30 సెకన్ల కంటే తక్కువగా కుదించడమే కేంద్రం లక్ష్యమన్నారు.

    లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేసే కొత్త టోల్‌ వ్యవస్థను దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో తాజాగా పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

    ఒక వాహనం జాతీయ రహదారిపైకి ప్రవేశించగానే టోల్‌ ప్లాజా వద్ద వాహన రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ను కెమెరా స్కాన్‌ చేస్తుందన్నారు. దీంతో ప్రయాణించిన కిలోమీటర్లకే ఛార్జీలు చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    రవాణా శాఖ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    రవాణా శాఖ

    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో మొబైల్
    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను ముంబై
    ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు ఆటో మొబైల్
    అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025