NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్ 
    తదుపరి వార్తా కథనం
    Delhi: బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్ 
    ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్

    Delhi: బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 08, 2024
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన పలు ఆస్తులపై దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సీలింగ్ చర్యలు చేపట్టింది.

    వివిధ జోన్లలో ఆస్తుల దుర్వినియోగం, బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు కోచింగ్ సెంటర్లు, ప్రాపర్టీ యజమానులకు MCD నోటీసులు కూడా జారీ చేసింది.

    అన్ని మండలాల్లోని బేస్‌మెంట్లలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లు, ఇతర ఆస్తులను గుర్తించేందుకు కార్పొరేషన్ సర్వే నిర్వహిస్తోంది.

    షాహదారా (సౌత్ జోన్),కరోల్ బాగ్,నజఫ్‌గఢ్ జోన్లలో బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించిన 10 ఆస్తులపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సీలింగ్ చర్య తీసుకుందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

    కరోల్ బాగ్ జోన్‌లో అక్రమంగా లైబ్రరీ నడుపుతున్న నాలుగు బేస్మెంట్స్ ను సీల్ చేశారు.

    వివరాలు 

    నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లు,ఇతర ఆస్తులను గుర్తించేందుకు కార్పొరేషన్ సర్వే 

    అదే సమయంలో, షహదారా సౌత్ జోన్‌లోని కోచింగ్ సెంటర్స్ లైబ్రరీకి చెందిన 4 బేస్‌మెంట్లను సీల్ చేశారు.

    కాగా, నజఫ్‌గఢ్ జోన్‌లో 2 బేస్‌మెంట్ల కోచింగ్ సెంటర్లు/లైబ్రరీలను సీలు చేశారు.

    దీంతోపాటు అన్ని మండలాల్లోని బేస్‌మెంట్లలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లు, ఇతర ఆస్తులను గుర్తించేందుకు కార్పొరేషన్ సర్వే నిర్వహిస్తోంది.

    ఈ చర్య భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా, భవిష్యత్తులో జరిగే సంఘటనలను నివారించడానికి విస్తృత ప్రయత్నంలో భాగం.

    బిల్డింగ్ నిబంధనలను ఉల్లంఘించే ఆస్తులపై ఈ చర్య కొనసాగుతుందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

    బిల్డింగ్ బైలాస్‌ను ఖచ్చితంగా అమలు చేయడానికి, విద్యార్థులు, పౌరుల భద్రతను నిర్ధారించడానికి కార్పొరేషన్ కట్టుబడి ఉంది.

    వివరాలు 

    ముగ్గురు సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థులు మృతి

    ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రూస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ లైబ్రరీలో చదువుతున్నప్పుడు, బేస్‌మెంట్‌లో అకస్మాత్తుగా నీరు నిండిపోవడంతో ముగ్గురు విద్యార్థులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

    ఈ ఘటనలో సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం
    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ
    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్

    దిల్లీ

    Fire In UP : బాగ్‌పత్‌లోని ఆస్తా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్‌సర్క్యూటే కారణమా ?  అగ్నిప్రమాదం
    Swati Maliwal: బిభవ్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రిజర్వ్ .. కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ  భారతదేశం
    Record Temperature: ఢిల్లీలో 52.3 రికార్డ్ ఉష్ణోగ్రత నమోదు  భారతదేశం
    Delhi:ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్.. శశి థరూర్ పీఏ అరెస్ట్  శశిథరూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025