NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
    తదుపరి వార్తా కథనం
    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
    దిల్లీ యూనివర్సిటీలో గొడవపై కమిటీ ఏర్పాటు

    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2023
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గందరగోళం నెలకొంది.

    బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం వెలుపల రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని యూనివర్సిటీ వీసీ ఏర్పాటు చేశారు. జనవరి 30 సాయంత్రం 5 గంటలలోపు వీసీకి ఈ కమిటీ నివేదకను సమర్పించనుంది.

    2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. అడాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది.

    బీబీసీ డాక్యుమెంటరీ

    24 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు

    దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రకటించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో 144సెక్షన్ విధించారు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ భవనం ఎదుట రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.

    ఈ క్రమంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ)కి చెందిన 24 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    అలాగే, బయటి వ్యక్తులు క్యాంపస్‌లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025