NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
    భారతదేశం

    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు

    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 28, 2023, 06:23 pm 1 నిమి చదవండి
    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
    దిల్లీ యూనివర్సిటీలో గొడవపై కమిటీ ఏర్పాటు

    ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గందరగోళం నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం వెలుపల రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని యూనివర్సిటీ వీసీ ఏర్పాటు చేశారు. జనవరి 30 సాయంత్రం 5 గంటలలోపు వీసీకి ఈ కమిటీ నివేదకను సమర్పించనుంది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. అడాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది.

    24 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు

    దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రకటించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో 144సెక్షన్ విధించారు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ భవనం ఎదుట రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ)కి చెందిన 24 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, బయటి వ్యక్తులు క్యాంపస్‌లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ

    తాజా

    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్

    నరేంద్ర మోదీ

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా భారతదేశం

    దిల్లీ

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు కల్వకుంట్ల కవిత
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023