NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ
    తదుపరి వార్తా కథనం
    హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ
    హెచ్‌సీయూలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత

    హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ

    వ్రాసిన వారు Stalin
    Jan 27, 2023
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ, కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాను ఏబీవీపీ పోటీ పడి మరీ ప్రదర్శించడంతో హెచ్‌సీయూలో మరోసారి వివాదం రాజుకుంది.

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి మోదీపై బీబీసీ రూపొందించిన 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' డాక్యుమెంటరీ రెండు సిరీస్‌లను ఎస్ఎఫ్ఐ ప్రదర్శించింది. యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా డాక్యుమెంటరీని ప్రదర్శించడంపై ఏబీవీపీ నాయకులు అసహనం వ్యక్తం చేసి డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    బీబీసీ డాక్యుమెంటరీకి కౌంటర్‌గా ఏబీవీపీ నాయకులు 'ది కాశ్మీర్ ఫైల్స్' స్క్రీనింగ్‌ను నిర్వహించారు. ఈ సమయంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు పోటీ పడి మరీ నినాదాలు చేయడంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

    హెచ్‌సీయూ

    సోషల్ మీడియాలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ పోస్టులు

    డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ విజయవంతమైందని, 400మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు ఎస్ఎఫ్ఐ తన సోషల్ మీడియా హాండిల్‌లో పేర్కొంది. ఏబీవీపీ తప్పుడు ప్రచారాలు, అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అందులో ఆరోపించింది. భావప్రకటనా స్వేచ్ఛ, క్యాంపస్ ప్రజాస్వామ్యం కోసం నిలబడిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ-హెచ్‌సీయూ సెల్యూట్ చేస్తుందని చెప్పింది.

    యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రదర్శనను నిలిపివేయడానికి ప్రయత్నించినట్లు ఏబీవీపీ ఆరోపించింది. మెయిన్ గేట్‌నుంచి ప్రొజెక్టర్‌ని తీసుకువస్తున్నప్పుడు యూనివర్సిటీ సెక్యూరిటీ తమ నాయకులను అడ్డుకున్నట్లు ఏబీవీపీ-హెచ్‌సీయూ సోషల్‌మీడియా హ్యాండిల్‌లో పేర్కొంది. తమ ప్రొజెక్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినట్లు వివరించింది.

    స్క్రీనింగ్ సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, రిజిస్ట్రార్ పేర్కొన్నారు. క్యాంపస్‌లోని భద్రతా అధికారులు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఏబీవీపీ ఆరోపించింది.

    ఫేస్బుక్ పోస్ట్ చేయండి

    ఫేస్‌బుక్‍‌‌ హ్యాండిల్‌లో ఏబీవీపీ చేసిన పోస్ట్

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ విజయవంతమైనట్లు ఎస్ఎఫ్ఐ ట్వీట్

    Glimpses from the succesful screening of the documentary 'India: The Modi Question' organized by SFI HCU on the Republic Day following the call of SFI CEC. More than 400 students turned out for the screening rejecting the false propaganda and the attempts of ABVP to (1/2) pic.twitter.com/Jy3On3Kps5

    — SFI HCU Unit (@SfiHcu) January 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    హైదరాబాద్

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం టర్కీ
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు సికింద్రాబాద్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025