BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు
2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ గుజరాత్కు చెందిన 'జస్టిస్ ఆన్ ట్రయల్' అనే ఎన్జీవో దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై దిల్లీ హైకోర్టు సోమవారం బీబీసీకి సమన్లు జారీ చేసింది. ఈ డాక్యుమెంటరీ పరువు నష్టం కలిగించే విధంగా ఉందని, దేశం, న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కులాలను ఎగదోసేలా ఉందని, అందుకే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు వెల్లడించింది. ఎన్జీవో తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ, రెండు భాగాల డాక్యుమెంటరీ దేశాన్ని, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉందని వాదించారు.