NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'
    తదుపరి వార్తా కథనం
    ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'
    మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఖండించిన భారత్

    ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'

    వ్రాసిన వారు Stalin
    Jan 19, 2023
    05:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా స్పందించింది. అపఖ్యాతితో కూడుకున్న కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించబడిన ప్రచారాస్త్రంగా కనపడుతోందని చెప్పింది.

    మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించడం వెనుక పక్షపాతం, వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.

    ఈ డాక్యుమెంటరీని రూపొందించడం వెనుక 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశ్నించే ఎజెండా ఉందని బాగ్చి స్పష్టం చేశారు. భారత్‌లో దీన్ని ఇప్పటి వరకు ప్రదర్శించబడలేదనే విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు.

    మోదీ

    ఈ డాక్యుమెంటరీ ఆ మీడియా సంస్థ ప్రతిబింబంలా కనిపిస్తోంది: బాగ్చి

    భారత ప్రధాన మంత్రిపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సంబంధింత ఆ మీడియా లేదా వ్యక్తుల ప్రతిబింబం అని అరిందమ్ బాగ్చి ఆరోపించారు. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు.

    బీబీసీ డాక్యుమెంటరీ పట్ల భారతీయులతో పాటు ప్రవాసులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లోని సమస్యలపై బీబీసీ యూకే దృష్టి పెట్టాలని ఒకరు ట్విట్టర్‌లో కామెంట్ పెట్టారు.

    అంతకుముందు యూకే పార్లమెంట్‌ లో కూడా బీబీసీ డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. దీన్ని హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ రామి రేంజర్ వ్యతిరేకించారు.

    ఒక బిలియన్ మందికి భారతీయులకు ఇది బాధకలిగించే విషయంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత న్యాయవ్యవస్థను అవమానిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    ప్రధాన మంత్రి

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025