NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత 
    తదుపరి వార్తా కథనం
    Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత 
    నూహ్ మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థలు, బ్యాంకుల మూసివేత

    Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత 

    వ్రాసిన వారు Stalin
    Aug 28, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను సోమవారం పూర్తి చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్ణయించింది.

    దీంతో హర్యానా ప్రభుత్వం, నూహ్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులకు సోమవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

    అంతే కాకుండా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 28 అర్ధరాత్రి 12గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

    వాస్తవానికి శోభాయాత్రకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. అయినా శోభా యాత్రకు నిర్వహించేందుకు వీహెచ్‌పీ పిలుపునివ్వడం గమనార్హం.

    సెప్టెంబరు 3-7 వరకు నుహ్‌లో G20 షెర్పా గ్రూప్ సమావేశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం యాత్రకు అనుమతిని నిరాకరించింది.

    నూహ్

    నూహ్ జిల్లాలో సెక్షన్ 144 విధింపు

    శోభాయాత్రపై నుహ్ ఎస్‌డీఎం అశ్వనీ కుమార్ స్పందించారు. శోభాయాత్రకు అనుమతి లేదన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాలో సెక్షన్ 144 విధిస్తున్నట్లు ప్రకటించారు.

    గుంపులు, గుంపులుగా తిరగొద్దని ఎస్‌డీఎం అశ్వనీ కుమార్ జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు. హర్యానా ప్రభుత్వం జిల్లాలో 1,900 మంది హర్యానా పోలీసు సిబ్బంది, 24 కంపెనీల పారామిలటరీ బలగాలను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద మోహరించింది.

    జులై 31న చెలరేగిన మత ఘర్షణల కారణంగా ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారి ఉన్నారు.

    నూహ్ జులై 31న మత ఘర్షణనలు చెలరేగిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటివరకు 393 మందిని అరెస్టు చేయగా, 118 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    ఇంటర్నెట్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    హర్యానా

    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం ప్రపంచం
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ

    ఇంటర్నెట్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు శ్రీనగర్
    హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ  హర్యానా

    తాజా వార్తలు

    ఆగస్టు 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం జమ్ముకశ్మీర్
    Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    Chess world cup 2023: ప్రపంచకప్ చెస్ ఫైనల్‌కు చేరుకున్న ప్రజ్ఞానంద: కార్లసన్‌తో నేడు ఢీ   చెస్ ప్రపంచ కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025